Saturday, October 18, 2008

తెలుగు నవల

















త్వరలో విడుదల కానున్న ప్రణవి నవల ‘గంగారామం’


ప్రణవి విరచిత తెలుగు నవల ‘గంగారామం’ త్వరలో విడుదల కానున్నది. పల్లెలే దేశానికి వెన్నెముక లాంటివనే గాంధీజీ తలంపుకు ప్రాణంపోసిన విశిష్టమైన ఈ నవలలో ఎన్నో దృశ్యాలు మరెన్నో కథనాలు పాఠకులను ఆకర్షిస్తాయి. వయసులోవున్న యువత, కాలేజీల్లో ప్రేమకలాపాలు, స్నేహాలు, మోహాలు, త్యాగాలు, భవబంధాలు, రాగద్వేషాల నవరస భరిత సమాగమమైన అంతర్లీన కథనాలు ఈ నవలకు ప్రాణం. కోయదొర కూతురు గంగకు సదా తోడు నీడగా వుండి అన్ని సమయాలలో ఆమెకు రక్షణ కల్పిస్తున్న ఆ మూగ కోయ యువకుడి హృదయంలో దాగిన ప్రేమ త్యాగంగా మారడం ప్రేమకు పరాకాష్ట. గ్రామాభ్యుదయం, నక్సలైట్ల పునర్వాసం లాంటి అంశాల్ని చిత్రీకరించిన తీరు అత్యద్భుతం. సేవకుడు కాలేనివాడు నాయకుడు కాలేడు అన్న సూక్తికి గంగారామం ఒక నిదర్శనం, మరువలేని అనుభూతి.
ఈ నవల కథాంశం ఆధారంగా నూతన తారాగణంతో సినిమాగా రూపొందించాలన్న నవలా రచయిత సంకల్పం ప్రశంసనీయం. నటనలో ఉత్సాహం కలవారు వెంటనే విజయేంద్ర క్రియేషన్స్, 79 ఈ, పీ.టి. రాజన్ సాలై, కే.కే. నగర్, చెన్నై – 78 సంప్రదించవచ్చును.

1 comment:

Sherfraz said...

The concept of the novel and quality of pictorisation is highly appreciable. The idea of devlopment for the country is essential and should be brought from Downtroddan. Film idea defnetly will be successful. It needs more publicity through various medias.
Best of luck.