Thursday, January 1, 2009

జనవరి 9,10, 11 న


ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ అంతర్జాతీయ సదస్సు విజయవాడలో....


తెలుగు భాష, సంస్కృతి, కళలు, వారసత్వ పరిరక్షణే ధ్యేయంగా పురోగమిస్తున్న సామాజిక సాంస్కృతిక సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య (World Telugu Federation), చెన్నై ఆధ్వర్యంలో జనవరి 9,10, 11 న విజయవాడలో 8వ అంతర్జాతీయ సదస్సు జరుగనున్నట్లు ఆసంస్ధ అధ్యక్షురాలు శ్రీమతి వి.ఎల్. ఇందిరా దత్ సంస్ధ వెబ్ సైట్ లో ప్రకటన జారిచేశారు. సదస్సులో భాగంగా నిర్వహింపనున్న చర్చాగోష్ఠులలో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు తెలుగు భాష, సాహిత్యం, నృత్యం, సంగీతం, చలనచిత్రం, ఇతర లలితకళలకు సంబంధించిన సమస్యలతో పాటు నేటి ప్రముఖ విషయాలైన వర్తక, వాణిజ్య, పరిశ్రమల రంగం, విజ్ఞానం, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యవిజ్ఞానరంగాలకు సంబంధించిన తాజా పరిస్ధితుల గురించి తోపాటు చర్చిస్తారు. సదస్సు జయప్రదం కావాలని సాహితి అభిలషిస్తోంది. సదస్సులో పాల్గొన దలచినవారు మరిన్ని వివరాలకు సమాఖ్య వెబ్ సైటు ను సందర్శించగలరు.

No comments: