Monday, November 30, 2009

హైకూలు Hykoos



హైకూలు



- డా. ఎస్. బషీర్, చెన్నై.



కొన్ని బంధాలు


కాయిన్ బాక్సులు


డబ్బిస్తేనే పలుకు


భీకర యుద్ధం
శవాల గుట్టలు
రాబందుల పండుగ

గడ్డి పరక
భయంతో వణుకుతూ పాపం
హిరోషిమాలో మొలకెత్తు

బంధాలు -పర్వతాలు
దూరం నుండి చూస్తేనే
అందంగా ఉండు

పాషాణ హృద్వి
అబద్ధ పర్వతాన్ని
చీల్చు ఓ చిన్ననిజం

భీకర సునామి
ప్రాచీన యుగసృష్టి
క్షణం లో మాయం

మేఘాల్ని తాకుతూ
పక్షి ఉత్సాహంగా
సాగింది పాపం

చల్లని సెలయేళ్ళు
పచ్చని చేల గట్లు
ఏవీ ఆ గ్రామాలు


గారాల బిడ్డ
అత్తవారింట్లో
గారెలా కాలిందే


జీవితం లో
కఠినమైనది
నెమ్మది తనం

Saturday, October 24, 2009

కవిత



వరదలు


- రాజశేఖర్, చెన్నై



1) ఆంధ్రావనిలో – వరదలొచ్చె
పంటలు కోల్పోయి – పశువులు కోల్పోయి
నివాసాలు కోల్పోయి – కుటుంబాలే చేల్లాచెదురాయె
గుండె చెదిరె గూడు చెదిరె
2) గలగల పారే కృష్ణా, జీవనదులు ప్రవహించె
కన్నీటజలమాయె రాయలసీమ,
నాటి రత్నాలసీమ, నేటి కన్నీళ్ళ సీమగా పరిణమించె
3) పచ్చని పైరులతో, పచ్చగ ఉండి
సశ్య శ్యామల తెలుగు నేలను నమ్ముకున్న రైతన్న నష్టపోయె!
4) కూడు-గూడు లేక ఆకలికేకలు
ఆర్తనాదాలు మిన్నంటుతుంటే
పాలకులే త్యాగాలు చెయ్యాలి
అందరికీ చేయూత నివ్వాలి
5) క్షణం కాదు యుగాలైన
సాఫీగా బ్రతకగలమంటు
ధీమా వ్యక్తం చేస్తున్నవారెందరికో
జీవితమంటే ఏమిటో తెలిసిపోయె
భోగభాగ్యాలు సమసిపోయె,
*****

Sunday, October 18, 2009

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి దీపాల వెలుగు

కావాలి జగమంత వెలుగు

దీపావళి శుభాకాంక్షలతో...

- సాహితి

Saturday, October 3, 2009

వరదబాధితులకు తక్షణ సహాయం – మానవీయ కర్తవ్యం

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2 అక్టోబర్, 2009 న వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో సహాయానికి సైతం నోచుకోక వరదప్రాంతాల్లో ఇరుక్కుపోయి విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, ఉత్తర కర్ణాటక జిల్లాలు, కార్వార్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని దక్షిణాది ప్రాంతాలప్రజలు ఆకస్మిక వరదలకారణంగా విపత్కరపరిస్థితులను ఎదుర్కొనుచున్నారు. తక్షణ సహాయం అందక మానవీయత మంటగలుస్తున్నది. ప్రాంతీయ భాషామీడియా పూర్తి ప్రాంతీయచైతన్యంతో మాత్రమే ముందుకు కదులుతున్నందున్నట్టనిపిస్తోంది. జాతీయస్థాయి ఛానెల్స్ ఈ విపత్తును విస్మరిస్తుండటం మరీ విడ్డూరం. ఈ అత్యవసర పరిస్థితిలో అవసరమైన వీరికి అవసరమైన సహాయం కోసం కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైనే ఆధారపడి వీక్షిస్తూ ఉంటే వరద పీడితులందరూ మరింత దారుణ కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. నిర్ణయాధికారుల ఉదాసీనతతో ఇంతటి తీవ్రదారుణ పరిస్థితులేర్పడ్డాయని మీడియా ఘోషిస్తోంది. ఈ తరుణంలో సహాయపడే హృదయంగలవారంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమచేతనైన సహాయంతో వరదబాధితులను ఆదుకోవాలి. ఇందుకు కేవలం డబ్బు మాత్రమే సహాయం చేయగలిగితే తక్షణం ఒనగూరే ప్రయోజనం అంతగా ఉండదు. పడవలు, ఇతర వాహనాలున్న వారు వరదప్రాంతాల్లో సహాయంకోసం అర్థిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు, వరదబాధలేని పరిసర ప్రాంతాలవాసులు వరదబాధితులకు వెంటనే అవసరమైన తిండి, నీరు, దుస్తులు, దుప్పట్లు మొదలైన వాటితో ఆపన్నహృదయులై వెంటనే ఆదుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆలస్యం అమృతం విషం అన్నస్థితిని బాధితులు ఎదుర్కోవలసి వస్తుంది. మనం చేసే తక్షణ సహాయమే బాధితులకు అమృతం. వరదపీడిత ప్రాంతాల ఇరుగుపొరుగు గ్రామ, పట్టణ, జిల్లాలవాసులు తక్షణమే స్పందిస్తే మానవత్వం మన్నగలుగుతుంది. పీడితులు ఆత్మస్థైర్యం కోల్పోకమునుపే మన చేయగలిగిన తప్పకుండా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా కేవలం సంబంధిత విభాగాల వారు మాత్రమే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే లక్షలాది బాధితులకు తక్షణ సహాయం అందక పోవచ్చు. పరిసర ప్రాంతాల అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను సహాయక కార్యక్రమాలలో వినియోగించేందకు ఉన్నతాధికారులు అవసరమైన అనుమతిని ప్రేరణను ఇవ్వాలి. వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఆపన్నహృదయులై తక్షణ సహాయంకోసం స్పందించి మానవీతను కాపాడగలరని సాహితి ఆశిస్తూ అర్థిస్తున్నది.

Saturday, September 12, 2009

మన తెలుగు

మన తెలుగు పద్యాలు

- మన్నవ గంగాధర్ ప్రసాద్, చెన్నై

కం. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుదిన లోకం బగు పెం
జీకటి నెవ్వడు వెలిగెడు
నేకాకృతితోడ నతని నే సేవింతున్.

భావం-
సకల లోకాలు, దిక్పాలురు, జనులు అందరూ నశించిననూ, లోకాలనావహించిన కారు చీకటిలో సైతం జ్యోతిలా వెలుగొందే ఆ భగవంతుని నేను సేవింతును.


( గజేంద్రమోక్షంలోని పద్యం ఇది)

Friday, August 7, 2009

కవిత kavitha

రక్షా బంధన్


Dr. S. Basheer, Chennai


ప్రేమామృత-మమతాను బంధాల మధుర పర్వమిది.
అన్నా- చెల్లెళ్ళ, అక్కా- తమ్ముళ్ళ, రక్షా కవచ మిది.
మధురం, సుమధురం ఈ అన్నాచెల్లెళ్ళ అనురాగ బంధం.
రక్త సంభంధాలకు ఆయువు, ఈ జన్మజన్మల సంబంధం.
ఉత్తర భారతీయుల ప్రాముఖ్య పండుగ ఆనాడు.
అన్ని మతాలవారు జరుపుకునే ఆత్మీయత పండుగ ఈనాడు.
కుటుంబ సభ్యుల సన్నిధిలో జరిగే ఈ రాఖీ పండుగ,
అన్న, చెల్లెళ్ళ కిచ్చే కానుకల పెన్నిధి నిండుగా.
అన్నా- చెల్లెళ్ళ అనుబంధాలకు ప్రతీక.
జన్మజన్మల సంబంధాలకు స్మారిక.
జగతిన ఆనందోత్సవాలతో వెలిగే దీపిక.
ఈ రాఖీ పండుగ అష్టైశ్వర్యాలను అందిస్తుంది నిండుగా.
“రక్షా బంధన్”గా ప్రసిద్ధిగాంచిన ఈ పండుగ,
“వృక్షా బంధన్”గా యువతరాన్ని ఆకట్టు కుంటున్నది,
“గ్లోబలైజేషన్” ప్రాముఖ్యత దశ దిశల చాటు తున్నది.
***************

Wednesday, August 5, 2009

కావడి – కుండలు

కావడి – కుండలు

“కావడి కొయ్యేనోయ్ ... కుండలు మన్నేనోయ్”
అని దాదాపు 50 సంవత్సరాల క్రితం,
శ్రీ ఘంటసాల గారు దేవదాసు చిత్రంలో పాడారు.
ఇది ఒకప్పటి సినిమా పాట .... పాత నానుడి. అందరికీ తెలిసిందే. . . . . .
మరి ఈ నూతన యుగంలో క్రొత్త నానుడి ఏమిటో సరదాగా కాస్త చూద్దామా !!!!!!!!
క్రింది చిత్రం చూడండి మీకే తెలుస్తుంది ...............
కావడి మాత్రం కొయ్యగానే వుంది కుండలు మాత్రం మారి పోయాయి.
--యస్సీవై నాయుడు, చెన్నై--





Monday, June 29, 2009

చెన్నై తెలుగు జర్నలిస్టులకు కంప్యూటర్ శిక్షణ

సాహితి సంపాదకులు డా. సి. జయ శంకర్ బాబు 28 జూన్ 2009 న చెన్నై తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో తెలుగు జర్నలిస్టులకు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పై ఈనాడు, సాక్షి దిన పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ సాహితి పాఠకుల కొరకు ...

(సౌజన్యం - సాక్షి - ఈ-పేపర్)




(సౌజన్యం - ఈనాడు - ఈ-పేపర్)




Friday, May 22, 2009

బాల సాహితి BALA SAHITI


కవిత

ఉయ్యాల


- సి. విజయేంద్ర బాబు, 4వ తరగతి


పార్కులో ఉయ్యాల ఊగుతున్నప్పుడు


గాలిలో తేలుతున్నట్టు


నింగిలో ఎగురుతున్నట్టు


విమానాలను పట్టుకున్నట్టు


పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు


ఎన్నెన్నో అనుభవాలు...


అలా చూస్తూ ఉంటే పచ్చని చెట్లు


దూరాన ఉన్న కొండలు అన్నీ


నా కళ్ళముందే ఉన్నట్టనిపిస్తుంది


పచ్చని చెట్లపై కిలకిలరవాలు చేస్తున్న పక్షుల్లా


మనసంతా ఆనందమయమే.



Friday, May 15, 2009

బాలసాహితి BALASAHITI


చిన్న కథ


కొంగ ఆలోచన



సి. శ్రీవైష్ణవి, ఒకటవ తరగతి.


ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ఒక సారి ఒక మృగాన్ని చూసింది. చూసి బయపడింది. ఆ మృగం కొంగని తినేద్దామా అనుకుంది. ఆ కొంగ పరిగెత్తి పోదామనుకుంది. ఆ కొంగకి దాహం వేసింది. నీళ్ళు తాగి పోదామనుకుంది. ఇంతలోనే ఆ మృగం ఆ కొంగని తినేసింది.


నీతి – ఆలోచించిన ప్రకారం చేయాల్సిన పని వెంటనే చేయాలి. ఆ కొంగ అనుకున్న వెంటనే ఎగిరిపోయి ఉండాల్సింది.

Monday, May 11, 2009

బాలసాహితి BALASAHITI







చిన్న కథ




కనువిప్పు




- మాస్టర్ సి. విజయేంద్ర బాబు





ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా సోమరిగా ఉండేవాడు. అతడికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయి. అతడి పేరు రంగన్న. అతడు రోజూ పని చేసేవాడు కాడు. అతడు రోజూ ప్రోద్దున నుంచి రాత్రి దాకా నీరు మాత్రం వదిలేవాడు. ఒక సారి అలాగే నీరు వదిలేందుకు రంగన్న, అతని కొడుకు పొలానికి వెళ్ళినపుడు ఉన్నట్టుండి పెద్దగా వాన కురిసింది. అక్కడ గుంతలలో నీరు నిండిపోవడంతో రంగన్న అతని కొడుకు మునిగిపోయారు.


అదే సమయానికి దగ్గరలో ఉన్న వారి స్నేహితులు ఇది గమనించి వారిద్దరినీ బయటికి తీసి ఆసుపత్రి లో చేర్చారు. కోలుకున్న తరువాత రంగన్నకు కనువిప్పు కలిగింది. తమకు రోజూ పనిచేసే అలవాటు లేక, సోమరిగా ఉండటము వలన ప్రమాదము ఎదుర్కోవలసి వచ్చిందని తెలుసుకున్న రంగన్న, అతడి కొడుకు కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు.

నీతి:- ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు. అలా ఉంటే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

Tuesday, May 5, 2009

Saturday, May 2, 2009

కవిత

మేడే


- డా. ఎస్. బషీర్, చెన్నై.


అరుణిమ కాంతులతో
విశ్వమంతా ధగ ధగ మెరిసింది
ధరణి అంతా ఎర్రటి కుంకుమంలా విరిసింది
ఆనంద తరంగాలు నింగికెగిసాయి
అందరి చేతులలో ఎర్ర జండాలు రెపరెప లాడాయి
సర్వత్రా శ్రామిక స్వరం హోరెత్తింది
పులకించి – పదండి ముందుకు అని సాగింది
పిడికిలి బిగించి మేఘాలతో గొంతు కలిపింది
సూర్యరశ్మికి స్వేద జలం వెండిలా మెరిసింది
భావితరాలకు విశ్వాసకిరణాలను కురిపించింది
ఈ మేడే రోజున....
జగతిన విజయ నగారా మ్రోగింది.

Wednesday, April 29, 2009

కవిత



చిట్టితల్లి


- డా. ఎస్. బషీర్, చెన్నై


చిట్టితల్లీ నీ బంగారు ముద్దుల పలుకులు

వేసవితాపాన పన్నీటిజల్లులు

కోటి చిరుదివ్యకాంతి పుంజాలు

నీరుచరిత మందహాసాలు

నీవునడయాడే మా లోగిల్లు

ముక్కోటి దేవతలకు నిలయాలు

నీ దివ్యనయన కటాక్షాలు

మలయసమీరాలు ఋతుపవనాలు

ముఖారవింద అందచందాలు

ఇంద్రలోకంనుండి కురిసిన వెన్నెల పారిజాతాలు

అక్షరలక్షలున్న ఎన్నడూ తరగని కరగని సిరులు

భవబంధాల అనుబంధాలకు తార్కాణాలు

నైరాశ్య జీవనాన ఆశలవర ప్రసాదాలు

నిశీథ హృదయఆకాశాన కోటితారక స్ఫటికాలు

పరితపించే శూన్య భవిష్యాన ప్రేరణ దీపికలు

జడత్వానికి చైతన్యం ప్రసాదించే శుభమంత్రాలు

వైష్ణవీదేవి నీ కరుణ కటాక్షాలు

ప్రతి ఇంటి ముంగిట కురవాలి అష్టైశ్వర్యాలు.

Tuesday, April 14, 2009

శుభాకాంక్షలు

తమిళ సంవత్సరాది చిత్తిరై తిరునాళ్ మరియు మలయాళ సంవత్సరాది విషు శుభాకాంక్షలు

మలయాళ సంవత్సరాది విషు
- అర్చన, చెన్నై
VISHU

VISHU is one of the important festivals of KERALA. It comes in the
MONTH OF APRIL usally on 14th. According to the traditional Malayalam
Calendar, it is the 1st day of the first month “Medam” of the New
Year. It is the astronomical New Year Day When the Sun Crosses the
Equator.
The “VISHUKKANI” is a ritual arrangement with auspicious articles
like Raw rice, Jack fruit, Coconuts, Gold coins, Golden cucumber, Metal
mirror, some coins in Silver cup, Flowers of the Konna tree (Cussia
Fistula) & a Holy text, in a bell metal vessel called “URULI” & both
side of the Uruli have two standing oil lamp (NILAVILAKKU).
On the either side of the Kani are place with a chair facing it.
Family members are taken BLINDFOLDED and then their blindfolds are
removed and they view the “VISHUKKANI”.
After “VISHUKKANI” the very next attractive feature is “KAAYI
NEETAL” - Where the ELDER Members in the family gift MONEY to the
YOUNGER ones. And everyone together in the family starts to burst the
cracker & enjoy through out.
And hence MALAYALIE’S being their first day of the year by waking upin front of KANNI.

Saturday, April 11, 2009

కవిత

ఉగాది శుభాకాంక్షలు

-యస్సీవై నాయుడు

“విరోధి నామ” సంవత్సరాన

సకల జనులకు, విశ్వ తెలుగు ప్రజలకు,

శత్రు శేషము ఉండరాదని,శత్రువులు మిత్రులుగా మారాలనీ,

సౌభ్రాతృత్వంలో మానవతా గులాబీలుప్రతి ఎదలో పూయించాలనీ,

విశ్వం అందమైన బృందావనంగా మారాలనీ,

శ్రేయోభిలాషులకు, ఇంటిల్లి పాదికి,

అందిస్తున్నాను ఉగాది శుభాకాంక్షలు.

Friday, March 27, 2009

విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు




ఉగాది
తెలుగు జనావళి స్వాగతిస్తున్న
విరోధి నామ ఉగాది
సర్వజనుల జీవితాలను సుఖాల పొదరిల్లులా మార్చి
విరోధపు విషఛాయలను దూరం చేసి
వసంతపు ఆనందాలను అందించాలని ఆకాంక్షిస్తూ....
విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


Thursday, March 5, 2009

భర్తృహరి సుభాషితం

- మన్నవ గంగాధర్, చెన్నయ్.

విద్యనిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్యనృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే ధనము, దాచి ఉంచగలిగినది అదియే, విద్య సకల భోగ కారకము, కీర్తి, సుఖము కలుగజేయును, విద్య గురువు వలె మార్గము చూపును, విదేశాలకు వెళ్లినపుడు చుట్టమువలె సాయపడును. విద్య కారణంగానే రాజ సత్కారాలు లభిస్తాయి, అటువంటి విద్య లేనివాడు మనిషే కాడు అని భర్తృహరి సుభాషితం.

Monday, March 2, 2009

పుస్తక సమీక్ష



విశ్వ చైతన్యంలో
సత్య దర్శనం

- ఏ. రాధిక


సత్యశోధనే ధ్యేయంగా, సత్ చింతనే లక్ష్యంగా కస్తూరి భాస్కర రావు గారి కలం నుండి జాలువారిన వ్యాస సంపుటి ‘విశ్వ చైతన్యంలో సత్య దర్శనం’ దార్శనిక చింతనతో నిండిన విశిష్ట కృతి. కేరళలోని కొచ్చిన్ లో నివాసముంటున్న భాస్కర రావు గారు తేట తెలుగులో విరచించిన ఈ సద్గ్రంథలో పరమాత్మ స్వరూపాన్ని ఒక నూతన దృక్కోణంలో ఆవిష్కరించారు. ఆత్మ స్వరూపాన్ని ఆవిష్కరించడంలోనైతేనేమి, సత్యమార్గాలనుపదేశించడంలోనైతేనేమి ఈయన సద్యుదాహరణల నేపథ్యంలో చక్కగా వివరించారు. శ్రీ రమణ మహర్షి ఉద్భోదలు ఈ వ్యాస సంపుటికి ఆధారం. శ్రీ రమణుడు విశ్లేషించిన వేదాంతసారాన్ని చక్కటి శైలిలో సులభ పదజాలంతో వ్యాసకర్త ఇందులో స్పష్టం చేశారు. ‘అహం’ అన్నది వ్యక్తిని ఆలోచనలకు దూరం చేస్తుందని, అది వ్యక్తి అధోగమనానికి మార్గం అవుతుందన్న విషయాన్ని తెల్పుతూ, సత్ పదార్థమైన వ్యక్తి శుద్ధ చిత్ స్వరూపంగా మిగలటం అనగా నిజమైన ఆత్మభావనగా వెలగటమన్నదానిని తెలుసుకోవటం గురించి తెల్పుటయే ఆత్మ విచారం అన్నారు.


గురు వైశిష్ట్యాన్ని ఉటంకిస్తూ గురువంటే మానవ శరీర రూపంలో అగుపించే కారుణ్య భావంతో రూపుగొన్న దైవంగా పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకూ విశ్వమెంత అభివృద్ధి క్రమంలో ఉన్నా ప్రతి వ్యక్తి తన జీవన క్రమంలో ఏదో ఒక దశలో గురు బోధనను తీసుకున్నవారే ఉంటారు. ఆత్మ తత్వమే సత్యం. ఆత్మ స్వరూపాన్ని అవగతం చేసుకున్నపుడు అజ్ఞానం అంతమై ఆనందరూపమైన పరిశుద్ధాత్మ స్వరూపం ఆవిష్కృతమౌతుందని, ఆ ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం తొలి మెట్టని పేర్కొనడం జరిగింది. ఆత్మనిష్టుడు ఆత్మ తృప్తి సాధిస్తాడు, ఆత్మ ఉన్నవాడు సాధించలేని కర్మ అన్నది ఉండదు. ఆత్మ సాక్షాత్కరం పొందిన వ్యక్తిని మోహం, వాంఛ అన్నవి దరి చేరవు. నేటి మారణకాండకు కారణమౌతున్న అసలు కారణాలు ఇవే. వీటిని జయించిన నాడు వ్యక్తి విశ్వ విజేత అవుతాడు. శాంతికాముకుడౌతాడు. స్వార్థం వికృతరూపం దాల్చి వెర్రితలలువేస్తున్న ఈ దశలో ఈ కృతి ఒక సన్మార్గదర్శిని అనడంలో అతిశయోక్తి లేదు.


సృష్టకి మూలం బ్రహ్మం. ఆ బ్రహ్మము తనేనన్న విషయం ఎరిగినరోజే విజ్ఞానము, సాధనలు, యోగములు అన్నీ ఆత్మ విజ్ఞానంలోనే లీనమౌతాయి. సత్యం, నిత్యమైన ఆనందం వస్తువుల్లో లేనే లేదు, పరమాత్మలోనే ఉంది. ఆ స్థితిలో బాధ, సంతోషం ఉండవు. తటస్థ స్థితికి, ప్రశాంతమైన స్థితికది మూలం. అందులో ఉన్నది కేవలం ఆనందం. ఏ భక్తి మార్గమైనా బోధించే సన్మార్గాన్ని ఆచరించటమే మనం చేయవలసినది.


అనాదిగా దైవశక్తికీ, జీవుడికీ మధ్య సంఘర్షణ జరుగుతోంది. శివత్వానికి, జీవత్వానికి, దైవత్వానికి అహంకారానికి నడుమ జరుగుతున్న ఈ అంతర్యుద్ధం అంతమయ్యే రోజున సృష్టిలో బాధ అన్నమాటే ఉండదు. నవవిధ భక్తితో, భగవంతుని ప్రసన్నం చేసుకొనుటకు భక్తుడు చేస్తున్న ప్రయత్నాలే భక్తి మార్గం. వీటన్నింటి సమాహారమే వేదాంతసారం. నేనన్నది మిథ్య. తానే బ్రహ్మస్వరూపమన్న నిజం తెలియజేయడమే ఈ వ్యాస సంపుటి మూల ఉద్దేశమనిపిస్తుంది. మన పురాణాలు, పవిత్ర గ్రంథాల వాస్తవ సారాంశమూ అదే.


విశ్వం ఒక జ్యోతి స్వరూపం. జీవులంతా చివరికి ఒకే పదార్థంలో లీనమౌతారు. ప్రతిదీ కర్మస్వరూపం. ప్రతి జీవికి తన కర్మ నిర్ధారణ జరిగి ఉంటుంది. ఏ వ్యక్తి కర్మరాహిత్యాన్ని కలిగి ఉండడు. ప్రతి జీవి కర్మలు చేస్తాడు. దాని ఫలాన్ని సైతం అనుభవిస్తాడు. మన భవిష్యత్తును నిర్ణయించేది భగవంతుడే. జరగాల్సింది సక్రమంగా, సకాలంలో జరుగుతుంది. జీవి ఏంచేయాలన్నా ఆయన అంగీకారం అవసరం. మహర్షుల బోధనలు, పవిత్ర గ్రంథాల ఉద్బోధలు అన్నింటి సారం ఈ సంపుటి సంకల్పం. అంతా అగోచర రూపదర్శనమే. సర్వేజనో సుఖినో భవంతు అన్నదే సమగ్రసారం.


‘జ్ఞాన గంగోత్రి అరుణాచలం’ అన్న వ్యాసంలో రమణ మహర్షి జననం, బాల్యం, జ్ఞానోదయం, అరుణాచలప్రవేశం మున్నగు విషయాలు పేర్కొన్నారు. ఈ సంపుటిలోని మొత్తం 48 వ్యాసలలో 43 వ్యాసాలు తెలుగులోను, 5 ఆంగ్లంలోను ఉన్నాయి. తెలుగులో చివరి వ్యాసం ఆది శంకరాచార్యులను గురించినది. ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులు నయన ప్రియమైనట్లు మనోహరమైన మహావాక్య భావాలు సులలితంగా ఉదహరించారు. ఈ వ్యాస సంపుటిలోని పలు వ్యాసాలు ‘విశ్వప్రకాశం’, ‘శ్రీరామకృష్ణ ప్రభ’, ‘జ్ఞానదర్శని’, ‘త్రివేణి’, ‘చిత్సుధ’, ‘యథార్థ భారతి’, ‘వేదాంతభేరి’ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో ప్రచురితమైనాయి.


ఈ కృతి ఆరంభ పుటల్లో ‘ఉపాసనీయం’ అనే శీర్షికన శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు తమ భూమికలో ఏకం సత్ విప్రా బహూదా వదంతి అనే ఆర్శవాక్యాన్ని నిరూపించే ప్రకృష్ట ప్రయత్నంగా ఈ వ్యాససంపుటిని కొనియాడారు. “స్థూలంగా ఈ సంకలనం రమణోపనిషత్తు, సూక్ష్మంగా ఆత్మ రమణ వేదాంతం, దాంతం, శాంతం అనే పథ ప్రదర్శకరదీపిక. శ్రీ కస్తూరి భాస్కరరావు గారు చాలా మంది సాధన తత్పురులలో ఒకరు. వచసు, మనసూ ఉపనిదాకృష్టం చేసినవారు. రమణ శ్రమణ మనసనిధి ధ్యాసల పట్ల తత్పరులు.” కస్తూరి భాస్కరరావు గారు ‘కారుణ్య స్రవంతి’ శీర్షికన తమ ముందుమాటలో సత్యశోధనలో తోచిన విషయాల్ని సహృదయులతో పంచుకొని ఆనందించాలనే ఆకాంక్షతో ఈ కృతిని వెలువరించానట్లు సెలవిచ్చారు.


శ్రీ కస్తూరి భాస్కరరావు గారు పదవీ విరమణ పొందిన చిత్రలేఖనోపాధ్యాయులు. ఈయన ప్రవాసాంధ్రులైనప్పటికీ తెలుగు భాషాభివృధ్ధి దిశగా కృషి చేస్తుండటమే కాక ఆధ్యాత్మిక లోకంలో చిరకాలం నిలిచిపోయే ఇలాంటి మరిన్ని సంకలనాలనందించ గలరని నా ఆకాంక్ష.


‘విశ్వ చైతన్యంలో సత్య దర్శనం’రచయిత కస్తూరి భాస్కర రావు, ప్రతులకు – నవోదయ బుక్ హౌస్, ఆర్య సమాజం ఎదురు వీధి, బడీ చౌడి, హైదరాబాదు, పుటలు – 216, మూల్యం – 100 రూ.

Monday, February 16, 2009

సమీక్ష sameeksha

విశ్వ చైతన్యంలో సత్య దర్శనం


కస్తూరి భాస్కర రావు గారి కృతి విశ్వ చైతన్యంలో సత్య దర్శనం
సమీక్ష త్వరలో సాహితిలో చదవగలరు.
(సమీక్ష - శ్రీమతి ఏ. రాధిక ద్వారా)

Monday, January 26, 2009

సాహితి పాఠకులకు, రచయితలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....ఒక కథానిక, ఓ దీర్ఘ కవిత



కథానిక
(రాయలసీమ మాండలికం)


జెండా రోజూ ఎగరల్ల


- డా।। సి. జయ శంకర బాబు


అయ్య అమ్మ
అక్క అన్న అందరూ
గాసానికి రెక్కాడిస్తేనే
అబ్బిగాడి మూతికి మెతుకు దక్కేది
ఇక వాడి డొక్కకు గుడ్డెక్కడిది!
సదువు సందె మాట
దేవుడెరుగు!
“పిల్లాడిని బడికి పంపీండని”
అయివారమ్మలంటే
“గతికేకి మెతుకే కరువు
అతికేకి కోకా కరువు
మాకేటికమ్మా సదవు”
అంది అబ్బిగాడి అమ్మ.
ఓటేసికి పోతే
అబ్బిగాడి అయ్యకు
దక్కిందొక జెండాగుడ్డ
సించి అతుకులేస్తే అదే
అబ్బిగాడికి నిక్కరూ సొక్కా!

సొక్కా నిక్కరు తొడిగిన అబ్బిగాడు
బడంటే ఏందో సూద్దామని పోతే
ఊరూ గేరులో ఉండే పిల్లగాళ్ళంతా
ఆడ సుట్టూ నిలబన్నారు
మద్దెలో ఓ గుంజ పాతినారు
దానికి తాడు గట్టినారు
గుసగుసలాడే బడిపిల్లల మాటలు
అబ్బిగాని సెవిన పన్నాయ్ -
“రోంచేపుంటే శాకిలెట్టిత్తారంట”
ఆశతో జొల్లుగారుస్తూ
అబ్బిగాడు నిలబన్నాడు.
బడిపిల్లల గుంపులో
అయ్యవారొచ్చి
గుంజకుండే తాడు ఇట్టాఇగ్గితే
పూలూ రంగుకాయితాలూ రాలినాయి
అంతా తలకాయిపైన సెయిపెట్టి
పైకి సూత్తాంటే
అబ్బిగాడూ సూసినాడు
ఓ గుడ్డ పేలిక గాలికెగురుతాంది
రత్తం లాగ ఎర్రగా
సున్నంలాగ తెల్లగా
ఆకులాగ పచ్చగా ఉంది
నడాన బండిసెక్రం
అబ్బిగాడి బుర్రలో ఏందో మెదిలింది...
“అయ్యకు సెప్పితే …”
ఇంతలో “జన గణ మన….” అంటూ
అంతా ఏదో పాడుతున్నారు
చివరికి “జయ జయ…” అంటుండగా
అబ్బిగాడు కూడా అరిసినాడు
“జై జై” అని
“ఇంగ అందరూ వర్సగా బల్లోకి పోండి
శాకిలెట్లిస్తారు”
పొడూగుండే పోరగాడన్నాడు.
పిల్లగాల్లంతా లోపలికి పోతాంటే
ఆడే గోడ పంచన నిలబన్నాడు
అబ్బిగాడు బిక్కుబిక్కుమంటూ
బల్లో అందరికీ శాకిలెట్లు పంచినంక
ఒగయివారొచ్చి బైట నిలబడిండే
పిల్లగాల్లకి సాకిలెట్లిచ్చినాడు
అబ్బిగాడికీ ఒగటి సిక్కింది
జోబులోబెట్టుకోని
ఇంటికి పారొచ్చి
అమ్మకీ అయ్యకీ
అక్కకీ అన్నకీ
సూపిచ్చి
“బల్లో జెండా ఎగిరేసినారు
నాకూ శాకిలెట్టిచ్చినారు”
అని వాడు సప్పరిస్తాంటే
సోతంత్రమంటే
అంత తియ్యగా ఉంటాదని
వాడి అమ్మకు, అయ్యకు
అన్నకు, అక్కకు అనిపించింది
“జెండా రోజూ ఎగరల్ల”
అబ్బిగాడు ఆశతో అన్నాడు
శాకిలెట్టు జుర్రుకుంటూ...





కవిత



గణతంత్రం .... మనకు శ్రేయో మంత్రం



- డా।। సి. జయ శంకర బాబు




జన గణ మన ఆశల ఫలితం
భారతానికి దక్కిన స్వాతంత్ర్యం
ఘనకీర్తి గలిగిన భారతీయ వీరుల
ఐకమత్య పోరాటాలకు
దక్కిన సుఫలం గణతంత్రం
జనులెల్లరకూ సమానాధికారాన్ని
కట్టబెట్టే జనస్వామ్యాన్ని
ఆదరించి అలవర్చుకున్నాం
భాషలెన్నైనా భావమొక్కటేనంటూ
రంగురూపాలేవైనా
భారతీయులందరూ ఒకటేనంటూ
క్రమశిక్షణే జాతి లక్షణంగా
ఐకమత్యమే మహాబలంగా
జన గణాల చైతన్య గమనంతో
సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య
గణతంత్రంగా వర్ధిల్లింది భారతావని
నేడు మన గణతంత్రానికి షష్టిపూర్తి
అరవై వసంతాలు పూర్తిచేసుకున్న
భారత గణతంత్రం
జగతిలోకెల్ల గొప్ప జనస్వామ్యంగా,
మారుతున్న ప్రపంచానికి మార్గదర్శిగా
అన్నింటా ముందంజంగా
అడుగులు వేస్తోంది.
శాంతికాంక్షతో మనం
అజాత శత్రువులుగా వర్ధిల్లాలనుకున్నా
అతివాదం అట్టహాసంగా
శాంతి పావురాన్నే
మింగేస్తానంటూంటే
జాతి రక్షణే ధ్యేయంగా
మన జవానులు
సన్నద్దులై ప్రాణాలొడ్డుతున్నారు
పోరులూ, ఆర్థిక మాంధ్యాలు
కరువులూ కాటకాలు
ప్రపంచాన్ని పీడిస్తున్నా
సస్యశ్యామల భారతావని
తన జన గణాలనెల్లా
చల్లగా కాపాడుతోంది
భారత గణతంత్రానికి
నేడు అరవయ్యవ వసంతోత్సవం
మనకందరికీ ఇది ఆనందోత్సవం

భాషకొక రాష్ట్రమంటూ
భాగాలేనాడో పంచుకున్నాం
మరళా ఇప్పుడు
కుండలు పంచుకోవటమేంబాగు ?
మన భాషలన్నీ
భారతమాత పలుకు తేనెల తియ్యదనమే
ఇప్పుడు మాది పాత మీది రోతంటూ రోషాలెందుకు
మాది గొప్ప మీది దిబ్బ అనే వేషాలెందుకు
భాషయేదైనా మన మధ్యన ప్రేమను పెంచేందుకేగాని
ద్వేషాగ్నిని రగిలించేందుకు కాదుగదా!
మనలో మనకు పోటీలెందుకు?
హిందువులైనా, మహమ్మదీయులైనా
క్రైస్తవులూ, జైన, బౌద్ధ, సిక్కు, జొరాష్ట్రియనులైనా
మనమంతా మానవీయతను కోరుకునే
భారతీయులమే కదా!
మరి మన మధ్య విభేదాలెందుకు?
జనలందరికీ సమానాధికారాన్నిచ్చిన
జనస్వామ్యంలో
కూడూ, గూడు, గుడ్డతో పాటు
మానం మర్యాదలుంటే చాలు కదా!
దౌర్జన్యాలూ, అవినీతి దారులూ
లంచగొండి దగా బతుకులెందుకు?
భారతీయులంతా ఆత్మీయభావంతో
ఐకమత్యంతో క్రమశిక్షణతో ఉంటే
శ్రమయే సేవగా భావించి
చైతన్యజీవనం సాగిస్తే
కరువులూ కాటాకాలూ
చోరులూ కిరాతకులూ
ఎవరూ మనల్నేమీ చేయలేరు
దేశమాత సేవకై
శిరసువంచి నిలబడే జనగణాలుంటే
జాతికి గణతంత్రం
అదే మనకు శ్రేయోమంత్రం!
మన జాతీయ ఝండా
రెప రెపలాడుతూ
మనందరికీ శాంతిసౌభాగ్యాలనందిస్తూ
నేటికి అరవై వసంతాలు పూర్తిచేసుకుంటోంది
ప్రతి అడుగూ ప్రగతి వైపే అంటూ
జగతికి తలమానికమైన భారతావణి
మనందరికీ గర్వకారణం...
జయహే జయహే భారతమాతా
నీకివే మాజోహార్లు
జై భారత్!

Saturday, January 24, 2009

కవిత

నేడు జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా సాహితి లో గతంలో ప్రచురితమైన కవిత అమ్మాయిలు పునః ప్రకాశితం (యుగ్ మానస్ మరియు సాహితి లో వచ్చిన స్పందనలతో పాటు)



అమ్మాయిలు

- డా. బషీర్, చెన్నై



అమ్మాయిలు
కంటికి రూపాలు
ఇంటికి దీపాలు
ముఖారవిందాలు
దేవుడి వరాలు
కలవారికి ఐశ్వర్యాలు
లేనివారికి ఆత్మస్థైర్యాలు

అమ్మాయిలు
వాడని వసంతాలు
వీడని సుమధుర భావాలు
తరగని అమృతభాండారాలు
అమరప్రేమకు నిర్వచనాలు
జన్మ-జన్మల అనుబంధాలు

అమ్మాయిలు
ఆశయాలకు ప్రతిబింబాలు
ఆశలకు ఊపిరులు
అనురాగాలకు ముద్దుమురిపాలు
ఆప్తుల పెదవులపై చిరునవ్వులు
కుటుంభాలకు సజీవ ప్రతిరూపాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
స్వర్గానికి నిలయాలు
మమతల కోవెలలు
సుఖశాంతుల లోగిళ్ళు
లక్ష్మీసరస్వతుల సంగమాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
కోటి దీపాల వెలుగులు
లక్ష తారకల జిలుగులు
సంగీత సుధారస భరితాలు
జననీ జనకుల జీవనసఫలాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
ప్రతిరోజూ పండుగలు
హోళీ దసరా దీపావళీలు

అమ్మాయిలు జాతికి చిహ్నాలు
దేశానికి గర్వకారణాలు
చరిత్రకు దర్పణాలు
నాగరికతకు కీర్తిపతాకాలు
దేశాభ్యుదయాని రథసారథులు

అమ్మాయిలే నాటికి నేటికి ఏనాటికి
తరగని కరగని అలుపెరగని అసమాన ధనులు
యోధులు, ధురంధరులు
అభిమానవతులు,
అజరఅమరఅఖిల జగాలలో
చరితార్థులు విద్యావేత్తలు
కారణజన్ములు
ప్రగతికి రథచక్రాలు
ఈ జగతికి సూర్యచంద్రులు

అమ్మాయిలే
సమస్తమానవాళికి
జీవనప్రదాతలు.




md said...
girl children are the gift of GOD which are reflected and highlighted in this poetry are appreciable.THE MESSAGE should be given wide publicity which is essential for the developement of WOMENHOOD
October 24, 2008 11:05 AM

Mrs. Asha Joglekar said...हर घर में बेटियाँख़ुदा का उपहार हैंमहकती बसंत बहार हैंपरिवार का दुलार हैंबहुत सुंदर पंक्तियाँ । कविता भी सारी बहुत भावभरी । October 18, 2008 12:19 PM

Reetesh Gupta said...बहुत सही ..अच्छा लगा...बधाईOctober 18, 2008 1:32 PM

Reetesh Gupta said...बहुत सही ..अच्छा लगा...बधाईOctober 18, 2008 1:32 PM

Sherfraz said...Bahut Khoobsurat hai. Bhavnayen lajavab hai.Sherfraz Nawaz.October 21, 2008 8:50 AM

Shashank said...Poem betiyaan is very nice. It shows the affection, respect for a girl child. Need of the hour.I wish this reaches the remotest of villages where girls are considered a burden even today.
N.Padmavathi

మీ స్పందనలకు స్వాగతం

Monday, January 19, 2009

నాట్యమయూరి శివాణి


సాహితి అభినందన


ప్రముఖ రచయిత, దక్షిణాది సినీరంగ ప్రముఖులు శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి ముద్దుల మనుమరాలు (శ్రీ సుబ్బారావు, శ్రీమతి కుమారి ల గారాలపట్టి), రేవతి రామచంద్రన్ గారి శిష్యురాలు కుమారి జీ. శివాణి భరతనాట్య ప్రతిభ ‘అమోఘం అద్భుతం’ అని ఎందరో ప్రేక్షకులు కొనియాడారు ఇటీవల చెన్నైలో శివగామి ఆడిటోరియంలో జరిగిన ఆమె నాట్యప్రతిభను నాట్యాభిమానులు వేనోల్ల కీర్తించారు. శివాణి ఉజ్జ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, ఆమె మరిన్ని ఉన్నత ప్రతిభా శిఖరాలనధిరోహించాలని సాహితి అభినందన.

Wednesday, January 14, 2009

సంక్రాంతి శుభాకాంక్షలు

చిత్రకారుడు - మాస్టర్ విజయేంద్ర బాబు
సాహితి పాఠకులకు, రచయితలకు సంక్రాంతి శుభాకాంక్షలు

Thursday, January 1, 2009

జనవరి 9,10, 11 న


ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ అంతర్జాతీయ సదస్సు విజయవాడలో....


తెలుగు భాష, సంస్కృతి, కళలు, వారసత్వ పరిరక్షణే ధ్యేయంగా పురోగమిస్తున్న సామాజిక సాంస్కృతిక సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య (World Telugu Federation), చెన్నై ఆధ్వర్యంలో జనవరి 9,10, 11 న విజయవాడలో 8వ అంతర్జాతీయ సదస్సు జరుగనున్నట్లు ఆసంస్ధ అధ్యక్షురాలు శ్రీమతి వి.ఎల్. ఇందిరా దత్ సంస్ధ వెబ్ సైట్ లో ప్రకటన జారిచేశారు. సదస్సులో భాగంగా నిర్వహింపనున్న చర్చాగోష్ఠులలో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు తెలుగు భాష, సాహిత్యం, నృత్యం, సంగీతం, చలనచిత్రం, ఇతర లలితకళలకు సంబంధించిన సమస్యలతో పాటు నేటి ప్రముఖ విషయాలైన వర్తక, వాణిజ్య, పరిశ్రమల రంగం, విజ్ఞానం, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యవిజ్ఞానరంగాలకు సంబంధించిన తాజా పరిస్ధితుల గురించి తోపాటు చర్చిస్తారు. సదస్సు జయప్రదం కావాలని సాహితి అభిలషిస్తోంది. సదస్సులో పాల్గొన దలచినవారు మరిన్ని వివరాలకు సమాఖ్య వెబ్ సైటు ను సందర్శించగలరు.

శుభాకాంక్షలు



నూతన సంవత్సరంలో పవిత్ర వైవాహిక బంధంతో క్రొత్తదంపతులుకానున్న సందర్భంగా యువకెరటాలు రామిరెడ్డి, నవీన లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.