Showing posts with label తెలుగు పద్యాలు. Show all posts
Showing posts with label తెలుగు పద్యాలు. Show all posts

Saturday, September 12, 2009

మన తెలుగు

మన తెలుగు పద్యాలు

- మన్నవ గంగాధర్ ప్రసాద్, చెన్నై

కం. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుదిన లోకం బగు పెం
జీకటి నెవ్వడు వెలిగెడు
నేకాకృతితోడ నతని నే సేవింతున్.

భావం-
సకల లోకాలు, దిక్పాలురు, జనులు అందరూ నశించిననూ, లోకాలనావహించిన కారు చీకటిలో సైతం జ్యోతిలా వెలుగొందే ఆ భగవంతుని నేను సేవింతును.


( గజేంద్రమోక్షంలోని పద్యం ఇది)

Thursday, March 5, 2009

భర్తృహరి సుభాషితం

- మన్నవ గంగాధర్, చెన్నయ్.

విద్యనిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్యనృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే ధనము, దాచి ఉంచగలిగినది అదియే, విద్య సకల భోగ కారకము, కీర్తి, సుఖము కలుగజేయును, విద్య గురువు వలె మార్గము చూపును, విదేశాలకు వెళ్లినపుడు చుట్టమువలె సాయపడును. విద్య కారణంగానే రాజ సత్కారాలు లభిస్తాయి, అటువంటి విద్య లేనివాడు మనిషే కాడు అని భర్తృహరి సుభాషితం.