Wednesday, December 31, 2008

శుభాకాంక్షలు

సాహితి పాఠకులకు, రచయితలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

- డా. ఎస్. బషీర్, చెన్నయ్

నవ వర్ష, సహర్ష, ఉత్కర్ష
సౌహర్ద్ర, ప్రేమ, పునీత
చందన పరిమళ జనిత
రాగ, రంజిత, సారస్వత, నాట్య కళాసుశోభిత
భావగర్భిత, మలయ సమీర సంజిత
సదా లలిత లావణ్య సుధారస గానం
యాగం, యోగం, భోగ భాగ్యం
విశ్వజనీన భరతవాక్యం “వసుదైవ కుటుంబం”
నిత్యకళ్యాణం పచ్చతోరణం
ఈ నూతన సంవత్సరం . . . .
సర్వ జనులకు సుఖినోభవంతు.

Thursday, December 11, 2008

Yuvataram

T h e D e s t r u c t i o n !!!
[Fantasy for youth]
- P R AN A V I

The HELL is beautiful, well developed and peaceful. The King YAMADHARMA RAJ sitting on his stone studded Golden throne, watching a dance programme of Rambha in Indra’s court yard, through his MAYA DARPAN which is more than a personal computer.
His principal Secretary CHITRA GUPT awfully dragged himself to the court yard of the king Yamadharma Raj, saluting him, tumbled down into his seat.
The king observed him carefully and ordered a refreshing coolant.
Gulping fast the ‘Soma pana’ a De-vine vitalizer, he looked relieved of fatigue.
“Tell me Chitragupt! What happened? Why are you damn tired? Have you not come by your flying horse?” The king enquired.
“The flying horse is uncontrollable my king. Oh! God! It took me to whirl wind race! I left it in the stable and walked away here. I don’t want that racy horse king. Let me walk here after all the way Yamraj!” narrated his harrowing experience.
Yama laughed aloud at his plight. “On the other day, when you watched on the Mayadarpan, the cities like New York, New Delhi, Mumbai, Chennai and Kolkatta, you were wondered to note the speeding and never ending traffic by four, three and two wheelers. You only asked me such vehicles for our kingdom, THE HELL. But, I explained to you all the vagaries we may face upon introduction of those vehicles, such as atmospheric pollution, constantly raising cost of oils, spare parts etc. Then you advised me to go for only wild riders like Horse, Donkey and Buffalo. I have agreed your suggestion and inducted wild riders for the benefit of all of you here. What else you need, tell me!...”
“No my king! Thank you very much! I can’t ride the flying horse any more. When I left the horse and walking down here, a Doctor’s soul stopped me en route and told me that I had excess blood pressure and excess fat in my blood. If I don’t walk, I would die and go to the EARTH! That is why I am worried my king!...” Chitragupt narrated sorrowfully.
“Oho! New diseases are cropping up here? I am also hefty like you! Do you think that should l also walk like you, Chitragupt?” expressed his doubt.
“Even for the Almighty….the HEALTH is mighty!!!...my Lord!”
“It’s true Chitragupt! Whoever protects health, they enjoy living. I will also walk!!...O.K.? Then,...What else you brought out of your horse ride?” the king asked.
Chitragupt thought for a while. “My king! I have come across unusual visuals but, not the first time! Many times earlier as well I have seen. Some how, I did not bring to your notice. To-day, a clarification is needed for such a drastic view, my Lord!”
“OK, tell me what was that baffled you?” king Yama asked.
“Normally all the souls of the humans who die prematurely due to accidents, murders, suicides or any such unexpected happenings on the earth, reach THRISHANKU, a temporary halt for such souls, till the destined time is over and then travel to the HELL or HEAVEN as per the past history of the individual souls.
“To-day, what I have seen is different my King. There are nine souls, hanging upside down, like bats in a cave, not in THRISHANKU but, en route to it. Why Sir? Whether THRISHANKU is over croweded? Or there is a DWISHANKU?...” enquired Chitragupt.
King Yama wondered to the report. He opened his MAYADARPAN and searched for the required information!
“I see….! That’s it!..” wide opened his eyes, grasped occurrences and looked back at Chitragupt.
“We are aware that countless diseases are invading mankind! But, now an unusual disease attacked and those nine souls are the victims to it, Chitragupt!..” the king told.
“You mean these nine souls were attacked? “
“Yah!” He peeped again into Mayadarpan. “Many souls were hanging the same way and vanished to their destinations. These are new arrivals Chitragupt. Do you want more information?..”
“Ha ji my King! Please enlighten me!”
“These nine souls are part of a ten member group of SWADEHAHUTI [self immolation] squad. They follow the instructions of their mentors! They destroy any persons, innocent, unconnected, unconcerned and all the people likely to live their own lives to the full extent and finally die themselves or fall victims to the protective forces !” the king Yama explained.
“Normally every one wants to live full life! But, what is this my Lord? Why is all this??”
“I can see now. Every thing is here. Let me tell you Chitragupt, please listen carefully……. All these nine souls pertain to the young bachelors from very poor families. All of them have been struggling for food each day. Many of their family members were suffering from sever illness.
“Father, a head of the family, was a cart puller of one fellow [soul], coffin maker for another fellow, a butcher for other fellow, a cleaner for other fellow, a thief and drunkard for other fellow and so on. They were not earning enough to meet both ends. Ultimately the family including all the children became sufferers.
“But these nine souls have immense love and affection towards their family members. Some how they wanted to pull out their families from poverty and illness. Some of their brothers and sisters or even parents were the victims of chronic diseases. Those souls wanted to provide them soul full of food and good health. Their only aim was to save the families from hunger and disease. They were searching for the way out. Their age at that point of time was around sixteen to eighteen years only. They were adolescent children.
“Some perverted religious people noticed the sufferings of these families and identified the smart and sentimental children who love their families very much. They trapped those boys, fed them and gave them the required money, put them on rigorous religious training, planted seeds of hate of the other religions. By the time they became over twenty years of age, the trainers showed them hefty amounts of money to part with their family members for their happy and healthy living and forced the youth to sacrifice their own physique in the name of God and do what ever destruction they design and order!! Thus those nine souls accepted few millions of Rupees and obliged to follow the route of destruction!!!..” King Yama was narrating.
“Some how, those souls have love and affection towards their family members. That should be appreciated! But, the destruction of other innocent, unconnected and unconcerned persons, can’t be excused my Lord!!!...” Chitragupt suggested.
“It’s true Chitragupt. The said crime attracts the maximum punishment available at the Hell!!! We can now see the execution of the crime by those misguided fellows here in the Mayadarpan. Please come and have a look!” asked Yama.
“Ok my king. Your narration is wonderful. Please watch and tell all of us here.” Chitragupt requested the king.
“A century old monument in Mumbai, a skyscraper nearby, a restaurant in a narrow lane, a hospital and railway station became the targets of these gullible and rustic forces. They were spraying bullets and throwing bombs and causing death to hundreds of people and fire to the buildings. The protecting forces from the Rulers emerged and started firing against these mad people. A fierce fighting was raged between the two groups of persons. Many people were rescued. Many injured. And many died. It continued over fifty hours Chitragupt. Out of ten misguided youth, nine fell to the bullets and one got injured and captured by security forces of the Rulers. Those nine souls only now hanging upside down out side the THRISHANKU Chitragupt.
“Till the destined time is over, those souls should hang upside down like bats there, and look at their own families for ever!!!..”
“The money promised by their mentors for conducting this cruel
act was delivered to their respective families. The family members were happy. They purchased their daily requirements from the markets and dumped in their houses.
“They cook their favorite food and gather to eat, all members together, excepting this lost soul. But, to the utter confusion and disgust to all of them the food cooked by them look like a mixture of blood and bones of the dead innocent victims of the attack by their son at Mumbai. They can not eat the food and throw the whole food away and suffer all the members with terrible hunger. They cannot eat any thing buying out of the said sinners’ money. The sufferings become enormous and never ending. All of them will weep with hunger and crying for the loss of a son. Ultimately they will think of committing suicides, the whole family. That is going to happen Chitragupt !!..” the king Yamadharma Raj explained.
“It’s so horrible my Lord! The innocent youth were pushed into a vicious circle and forced to commit the heinous crime. Ultimately they also lost their lives. Their families cannot eat at least normal food. Their sufferings will multiply. These souls hanging upside down, looking the fate of their families will cry and cry uncontrollably. Only for the sake of their own families, they accepted the money and committed the greatest sins. But, how to let the youth know all the bad effects compounded in these deeds. Kindly guide them my king!! ..” Chitragupt prayed.
“Hanging upside down, very close to the HELL, the souls of the misguided youth, will be weeping uncontrollably for the sufferings of their family members, even after getting large amounts of money. Those sounds of heart burning cries and sobbing will be clearly seen and heard by their family members, particularly their parents. They cannot tolerate such cries from their beloved sons. At the same time, the people in the society will discard these families and will not accept any boy or girl for marriage and do not have any social meetings, get together etc with these families. The families will be isolated in the society!! The youth will be cautious. They will not yield to such crazy and dubious offers by the cheaters in the name of religion. The suffering parents also tell their pathetic story to all the people around them and warn the public!!! Don’t worry Chitragupt.” the king Yamadharma raj told.
“Thank you my Lord. My doubt is cleared. I can happily walk to my abode and sleep to night.” Chitragupt saluted the king of the Hell and walked away. The HELL is beautiful, still……….

*^*^*^*

Friday, October 31, 2008

కవిత kavita

అ మ ర జీ వి – స మ ర గా థ



- డా. యస్. బషీర్, చెన్నై




భారత స్వాతంత్ర్య చరిత్రలో గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . . అమరజీవికి ఆంతటి పేరున్నది. “తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం, అజరామరం! ఓ అమరకావ్యం! అనితర సాధ్యం! ఓ మహోదయం! నవోదయం! ఓ మహా సంగ్రామం!


అమరజీవి – సమర గాథ




భారత స్వాతంత్ర్య చరిత్రలో
గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో
ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . .
అమరజీవికి ఆంతటి పేరున్నది.
“తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన
పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం,
అజరామరం! ఓ అమరకావ్యం!
అనితర సాధ్యం! ఓ మహోదయం!
నవోదయం! ఓ మహా సంగ్రామం!
నేడు ఆంధ్ర రాష్ట్ర 53వ అవతరణ దినోత్సవం!
అమరజీవి నామస్మరణం,
సమరజీవి పవిత్రాత్మకు నివాళులర్పించడం,
ప్రతి తెలుగువాడి కర్తవ్యం !

అమరజీవి ఆశయాలను
తెలుగు జాతి, భాషా సంస్కృతులను
సత్యం, అహింసా, ధర్మాచరణాలను,
పరిరక్షించు కోవటం మన ధర్మం.
పొట్టివాడైనను గట్టివాడుగా
విలువైన ప్రాణాన్ని తృణప్రాయంగా యెంచి
లక్ష్యసాధనే ధ్యేయంగా పురోగమించిన
అమరజీవి ఆత్మ బలిదానం
విశ్వ స్వాతంత్ర్య చరిత్రలో
కనీ, వినీ, ఎరుగని సాహస ఘట్టం
తెలుగువారందరి మేలుకోరిన ఓ మహాయాగం!
తెలుగు జాతికి గౌరవం, గుర్తింపు కలిగించిన
పొట్టి శ్రీరాముల జీవిత చరిత్ర
ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షరమయం
తెలుగుజాతి హృదయాల్లో శ్రద్ధాసుమాల ప్రళయం.
“పొట్టి శ్రీరాముల వంటి పదిమంది శిష్యులుంటే
సంవత్సర కాలంలో స్వరాజ్యం సంపాదించ గలనని” గాంధీజీకు ధీమా
కలిగించిన ధన్య జీవి! త్యాగ జీవి! కర్మయోగి!
భగీరధుడు, గంగను భువికి దించినట్లు
ఆంధ్ర రాష్ట్రమును సాధించిన ఘనుడు అమరజీవి.
నిజమైన దూరదర్శి! కార్యశీలి!

58 రోజులు నిరాహార దీక్షచేసి
అమరజీవి ఆత్మార్పణం
తెలుగు వారికయ్యింది వరప్రసాదం
ఓ త్యాగ శీలి . . .
నీ కలలను తెలుగువారు
చెయ్యాలి సఫలం! అదే పవిత్రాత్మకు బలం.
అమరజీవి దివ్య దృష్టి! పారదర్శకత,
లక్ష్యసిద్ధి, సంకల్పం, ఉద్యమస్పూర్తి,
తెలుగువారిని మేలుకొలిపి
ప్రసాదించె, నవచైతన్య స్ఫూర్తి!
ఓ అమరజీవి! నీకు జోహార్లు
ఓ సమరజీవి! నీకు శతకోటి వందనాలు
అభినందన చందనాలు.





*** *** ***





అంతరంగం ANTARAGAM









తెలుగుకు ప్రాచీన భాష హోదా
నవ్వడానికా? ఏడ్వటానికా?
(త్వరలో అంతరంగం లో చదవగలరు)

Thursday, October 30, 2008

సమీక్ష sameeksha

PRANAVI ’ S..
G A N G A A R A A M A M.
[ Telugu Novel }



[GANDHI KALALA SAAKARAM]
[ FULFILLING THE DREAMS OF GANDHI ]

{{ In a nut shell }}

Raama Prasaad, doing his post graduation at Vizag, is from a small village. From his childhood, his parents used to tell him to develop his own village at any cost and bring prosperity to all the villagers, relieving them from the vicious clutches of his paternal uncle, a land lord and the President of the village Panchayat, who is hindering the prosperity of the agriculturists and looting all the benefits offered by the Government through Village Panchayats. Thus his mind tuned to take up the Herculean task.
Jhansi Raani, daughter of an industrialist, junior to Raama Prasaad in the college, loved him and wanted to marry him. He analyzed the situation. If he marries Jhansi Raani, he will become an industrialist and enjoy a rich city life. But, can not fulfill the ambitions of his parents. He wanted to tell this clearly to his girl friend.
At this point of time, he had an opportunity to visit a forest under Anthropological programme of his course of study in the college. He met a tribal girl in a freak accident in the forest, who saved him from a snake bite. He has seen her living habitat and wondered how bad and sad the dwelling habitat is. Then he decided that the development of a village should start from here only. So that not only the development of the village, but a combined living for villagers and the tribals can also be achieved. So great and tremendous task for him.
How he has convinced his girl friend of his future plans, how he married the tribal girl and worked all the way with tribals, faced serious threats from the Naxalites in the forest and finally achieved a GUINNES record of development and brought all his villagers to the new village GANGAARAAMAM for a combined living with the tribals, to which the entire Government of Andhra Pradesh as well as the Central Government wondered and accepted to inaugurate the newly born village GANGAARAAMAM by the Prime Minister accompanied by all the Chief Ministers of India.
************************
Cost of the book Rs.299/- available with Navabharat Book House // Navayuga Book House, Hyderabad.


Or write to the Publisher Vijayendra Creation, 79/E, P.T.Rajan Salai, K,K.Nagar,


Chennai-600 078. Postage free in India and the postage to be paid for mailing abroad.

READERS MAY PLEASE MAIL THEIR OPENION ON THE NOVEL.


[[ Pranavi_soms@yahoo.com ]]

Wednesday, October 29, 2008

కవిత kavita

స్నేహా0జలీ – దీపావళి



- ఎస్.సి.వై. నాయుడు, చెన్నయ్



ఎ0తమధుర0 – ఈ స్నేహబ0ధ0
అపూర్వ0 – అనిర్వచనీయ0
మనోహర0 – అతి కమనీయ0
ఆకర్షణ0 – అతి రమణీయ0
అమరకావ్య0 – సుధారస భరిత0

ఈ దివ్య, నవ్య, రమ్య దీపావళి
ర0గు ర0గుల హరివిల్లు, కోటి కా0తులు వెదజల్లు
స్నేహ పరిమళ0, దీపాల కా0తిపు0జ0 జగమ0తా విరజిల్లు
అ0ధకార0పై విజయ0
సర్వత్రా స0ప్రదాయ పరమార్ధ0 చేకూరాలని,
దీపావళి శుభవేళ అక్షర దీపావళి వెలిగిస్తున్నాను
స్నేహ – ప్రేమ నమస్సుమా0జలి అ0దిస్తున్నాను.


***

Saturday, October 25, 2008

దీపావళి శుభాకాంక్షలతో...



దీపావళి శుభమస్తు



- డా. ఎస్. బషీర్, చెన్నయ్



దీపాల వెలుగులో జగమంతా మెరిసె
అష్టైశ్వర్యాలతో జనులందరూ మురిసె
పూల సుగంధాలు ప్రతి ముంగిట కురిసె
ఆనంద లాహిరిలో పుడమి పులకరించె
అందరి హృదయాలలో స్నేహభావాలు పలకరించె
ఈ దీపావళి సమస్త మానవాళికి
సుఖశాంతి సమృద్ధి ప్రసాదించె
ముక్కోటి దేవతలు ఒక్కటై ఆశీర్వదించె
తమసోమా జ్యోతిర్గమయ నినదిస్తూ
అజ్ఞానాంధకారాలు నశియించె
జడ సమాజంలో చైతన్యవాహిని ప్రవహించె
విశ్వ జనవాణిలో ఐక్యతాగీతం పరవశించె
దీపాల వెలుగులో, మతాబుల జిలుగులో
జగమంతయు సంగీతభరిత సుధారస గానమాయె.

Sunday, October 19, 2008

కవిత kavita


అమ్మాయిలు

- డా. బషీర్, చెన్నై


అమ్మాయిలు
కంటికి రూపాలు
ఇంటికి దీపాలు
ముఖారవిందాలు
దేవుడి వరాలు
కలవారికి ఐశ్వర్యాలు
లేనివారికి ఆత్మస్థైర్యాలు

అమ్మాయిలు
వాడని వసంతాలు
వీడని సుమధుర భావాలు
తరగని అమృతభాండాగారాలు
అమరప్రేమకు నిర్వచనాలు
జన్మ-జన్మల అనుబంధాలు

అమ్మాయిలు
ఆశయాలకు ప్రతిబింబాలు
ఆశలకు ఊపిరులు
అనురాగాలకు ముద్దుమురిపాలు
ఆప్తుల పెదవులపై చిరునవ్వులు
కుటుంభాలకు సజీవ ప్రతిరూపాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
స్వర్గానికి నిలయాలు
మమతల కోవెలలు
సుఖశాంతుల లోగిలులు
లక్ష్మీసరస్వతుల సంగమాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
కోటి దీపాల వెలుగులు
లక్ష తారకల జిలుగులు
సంగీత సుధారస భరితాలు
జననీ జనకుల జీవనసఫలాలు

అమ్మాయిలున్న ఇళ్ళు
ప్రతిరోజూ పండుగలు
హోళీ దసరా దీపావళీలు

అమ్మాయిలు జాతికి చిహ్నలు
దేశానికి గర్వకారణాలు
చరిత్రకు దర్పణాలు
నాగరికతకు కీర్తిపతాకాలు
దేశాభ్యుదయాని రథసారథులు

అమ్మాయిలే నాటికి నేటికి ఏనాటికి
తరగని కరగని అలుపెరగని అసమాన ధనులు
యోధులు, ధురంధరులు
అభిమానవతులు,
అజరఅమరఅఖిల జగాలలో
చరితార్థులు విద్యావేత్తలు
కారణజన్ములు
ప్రగతికి రథచక్రాలు
ఈ జగతికి సూర్యచంద్రులు

అమ్మాయిలే
సమస్తమానవాళికి
జీవనప్రదాతలు.

Saturday, October 18, 2008

తెలుగు నవల

















త్వరలో విడుదల కానున్న ప్రణవి నవల ‘గంగారామం’


ప్రణవి విరచిత తెలుగు నవల ‘గంగారామం’ త్వరలో విడుదల కానున్నది. పల్లెలే దేశానికి వెన్నెముక లాంటివనే గాంధీజీ తలంపుకు ప్రాణంపోసిన విశిష్టమైన ఈ నవలలో ఎన్నో దృశ్యాలు మరెన్నో కథనాలు పాఠకులను ఆకర్షిస్తాయి. వయసులోవున్న యువత, కాలేజీల్లో ప్రేమకలాపాలు, స్నేహాలు, మోహాలు, త్యాగాలు, భవబంధాలు, రాగద్వేషాల నవరస భరిత సమాగమమైన అంతర్లీన కథనాలు ఈ నవలకు ప్రాణం. కోయదొర కూతురు గంగకు సదా తోడు నీడగా వుండి అన్ని సమయాలలో ఆమెకు రక్షణ కల్పిస్తున్న ఆ మూగ కోయ యువకుడి హృదయంలో దాగిన ప్రేమ త్యాగంగా మారడం ప్రేమకు పరాకాష్ట. గ్రామాభ్యుదయం, నక్సలైట్ల పునర్వాసం లాంటి అంశాల్ని చిత్రీకరించిన తీరు అత్యద్భుతం. సేవకుడు కాలేనివాడు నాయకుడు కాలేడు అన్న సూక్తికి గంగారామం ఒక నిదర్శనం, మరువలేని అనుభూతి.
ఈ నవల కథాంశం ఆధారంగా నూతన తారాగణంతో సినిమాగా రూపొందించాలన్న నవలా రచయిత సంకల్పం ప్రశంసనీయం. నటనలో ఉత్సాహం కలవారు వెంటనే విజయేంద్ర క్రియేషన్స్, 79 ఈ, పీ.టి. రాజన్ సాలై, కే.కే. నగర్, చెన్నై – 78 సంప్రదించవచ్చును.

Flood Relief work from PURNEA



Dear Sir,


Our flood relief work is going on in Murliganj Block of Madhepuradistrict. Today I have got a digital still camera here. Friday is myoff day so I will go to Purnea and will also visit to Mruliganj Block.Our volunteers are making arrangement for distribution in Murliganjbecause we have lack of materials and the demand is in bulk. Anywaywith the support of some local youth we are managing everything. Wehave distributed 260 kits (5kg Rice, 2kg pulse, 500 gm Biscuits, 1pack candle, two piece match box, 1 kg salt) on 4tha and 5th october2008 very successfully.Now we are distributing another kit in 500 family. This kit is made of1 torch with battery, 1 blanket, 1 new saree, 1 Aluminium Handi, 1Steel Thali and 1 plastic glass. All these things will be provided byGOONJ.In coming days, we will distribute 500 piece TENT with the support of GOONJ.We are also collecting waste cloth for winter. we are trying toprovide needle and thik thread (Sui-dhaga) to women for preparingbed with wastage cloths. You know in coming 15 days, they will shiverfrom cold. So we are trying to save them from this cold with our bestpossible.We are very grateful to GOONJ founder director Mr. Anshu Gupta and AMPgen. sec. Mr KN Jha. GOONJ is providing us material continuously. SriKN Jha has also given us material watever AMP collected. Ms. PinkyKumari and Mr. Alok Kumar is conduction relief work here verysuccessfully.I hope we will get some winter cloths especially for baby and baby food also.


With best regards,


Vinay Tarun
Copy Editor, Hindustan Daily, Bhagalpur - 09234702353

Thursday, October 9, 2008

విజయదశమి శుభాకాంక్షలు


సాహితి పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు

Tuesday, September 30, 2008

Flood Relief in Remote Areas of Bihar


Dear Sir,

GOONJ has provides us food material for 300 familiesa and we are
preparing familywise kits. We will distribute it on 1st OCT 2008. As
you know that our team is working in Murliganj Block (ward No 11 and
12) of Madhedpura district intensively. People of there are surrounded
by flood water still and administration is still not succeeded to make
communication with them. We reached there with boat and made a list of
about 300 most poor family. At first, we are providing food there.
After that, we will try to do other activities there like community
development, awareness, PRA etc.

As you know that GOONJ is giving us material support only and we have
to arrange other expenses ourselves. Our office is 55 KM far from the
affected area and we need some cash money also for transportation,
volunteers and other arrangements.

If anyone interested to help us, Please contact
1) Mr. Alok Kumar
State coordinator
Asha Vikash Pariyojana (AVP)
Cell No - 09234828161

2) Ms Pinky Kumari
Coordinator, Purnea (AVP)
Cell No - 09852275160

Sir, tomorrow I am going to Murliganj and return on 1st or 2nd october
2008. I will returned with some rare photographs also because we have
arranged a camera today.

With best regards,

Vinay Tarun
Journalist
Mob: 09234702353
E-mail: tarunvinay@gmail.com


Note- We are working with the NGO Asha Vikash Pariyojana (AVP). Anyone
can send cash support directly into its flood relief account.
CASH DONATIONS/SUPPORT - For Communication, Collection camps, storage,
sorting, packing, travel, Transportation and local distribution
expenses. Cash donations can be made directly into our Flood Relief
Account or you can send an account payee Cheque / Draft in favour of
ASHA VIKAS PARIYOJANA FLOOD RELIEF FUND payable at State Bank of India
Nathnagar, Bhagalpur branch. SBI Core Banking Account No -30475764609.
(All donations are tax exempted u/s- 80 G of IT act.)
Please send a letter about cash donations/supports.

Saturday, September 27, 2008

మన తెలుగు MANA TELUGU

మన తెలుగు పద్యాలు

- మన్నవ గంగాధరప్రసాద్

గజేంద్రమోక్షం

కం. కలఁడందురు దీనులయెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలిన్
గలఁ డందురన్నిదిశలను
కలఁడు కలం డనెడువాఁడు కలఁడో లేఁడో.

భావం -

దీనులయందు, పరమయోగి గణములయందు.. సర్వదిక్కులలోనూ ఉన్నాడని చెబుతున్నభగవంతుడు నన్ను రక్షించడానికి రాలేదు.. సర్వంతర్యామిగా ఉన్నాడన్న భగవంతుడు.. ఉన్నాడో లేడో అని గజేంద్రుడు చింతిస్తున్న సన్నివేశం.. పోతన కవిహృదయానికి నిదర్శనం.

Saturday, August 23, 2008

బాల సాహితి BALA SAHITI



శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు...


Janmastami Greetings...


ఉప్పలధడియం అన్నపూర్ణ



చిన్నారి చిత్రకారిణి ఉప్పలధడియం అన్నపూర్ణ కలం నుండి జాలువారిన వర్ణచిత్రం

Friday, August 15, 2008

వెబ్ లోకం

వెబ్ లోకం


వెబ్ విశ్వంలో తెలుగు ఏ స్థానంలో ఉందో ఆలోచించి తెలుగు వ్యాప్తికై నేను సైతం కృషిచేయగలనని సంకల్పించే తెలుగువీరుల చైతన్యం కోసమే ‘వెబ్ లోకం’ శీర్షిక. సాహితి పాఠకులలో వెబ్ పరిజ్ఞానాన్ని వికసింపజేయటానికి ఉద్దేశించిన ఈ శీర్షిక లో ధారావాహికంగా ప్రచురితమయ్యే వ్యాసాల పరంపరలో మొదటి వ్యాసం ‘వెబ్ లో తెలుగు’ చదవగలరు.

వెబ్ లో తెలుగు

- డా. సి. జయ శంకర బాబు

వెబ్ విశ్వంలో తెలుగు స్థానం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, ఆపై తెలుగు అభిమానుల తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దాం.

కంప్యూటర్లు పుట్టిన నాటినుండి వాటి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాషగా ఆంగ్లం వర్ధిల్లుతోంది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయమే. ఆంగ్లేయులపాలనలో మనకబ్బిన ఆంగ్లభాషా పరిజ్ఞానం మనల్ని కంప్యూటర్ రంగంలోనూ రాణిస్తున్నదేశాల్లో ఒక ప్రముఖ దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు తోడ్పడింది. ఈ పరిజ్ఞానాన్ని మన భాషలకు కూడా అందజేసి మన సంస్కృతి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, వెబ్ విశ్వంలోనూ మన భాషల ఆనవాల్లు శాశ్వతంగా ఉండేలా ప్రయత్నించటం మన కర్తవ్యం. అత్యంత అభివృద్ధి చెందిన జపాన్, చైనాలాంటి దేశాలకంటే ముందు మనదేశంలో కంప్యూటర్ వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టగలిగాము. మనకంటే ఆలస్యంగా తమ దేశంలో కంప్యూటర్లకు స్థానం కల్పించిన చైనా ఆదర్శాన్ని గురించి కూడా మనం ఈ క్షణంలో స్మరించటం ముదావహం. చైనీయులు తమ భాషకు స్థానంలేని కంప్యూటర్లకు తమదేశంలో స్థానంలేదంటూ ప్రతినబూని మరీ సాధించారు. మనం ఆంగ్లంలోనే సరిపుచ్చుకున్నా నేడు వెబ్ విశ్వంలో మన భాషల స్థితిగతులేమిటో ఆలోచిస్తే మనకు ఆవేదన కలుగక మానదు.

భారతీయ భాషలకు వెబ్ విశ్వంలో స్థానం దక్కిందని మనం సంతోషంచినా, మనమంతా సమైక్యంగా ముందుకు కదలటంలేదనే సత్యాన్ని గుర్తించవలసి ఉంది. అదెలా అంటే నిన్నటివరకూ మనభాషలకుపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన మనం వెబ్ విశ్వంలో విస్తరిస్తున్నామని సంతోషించినా, మనమందరం ఉపయోగిస్తున్నది మాత్రం ఉమ్మడి పరిజ్ఞానం కాదన్నది నిజం. ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఇతర మాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఏ కొందరో ఉపయోగిస్తున్నారు. వారు ఉపయోగిస్తున్న ఇతర కోడ్ కలిగిన ఫాంట్ లో ఉన్న కొంత సామగ్రిని సర్చ్ ఇంజన్లు వెదుకుతున్నప్పటికీ వీటి వల్ల మన తెలుగు లభించివలసిన ఉమ్మడి ప్రయోజనం మాత్రం అందటం లేదు. పరివర్తనీయత, పఠనీయత వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో వెబ్ సైట్ కు ఒక ఫాంట్ ను ఉపయోగిస్తుంటే అన్ని ఫాంట్లను మన కంప్యూటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవటం కూడా అంత వ్యావహారికం కూడా కాదు. ఫాంటు లేకుండా ఈ-మెయిల్, చాటింగ్ వగైరా కూడా సాధ్యపడదు. ఇలాంటి మరెన్నో కారణాలు, అసౌకర్యాలున్నప్పటికీ యూనికోడ్ వైపెందుకో మన వారి శీతకన్ను. మన తెలుగు పత్రికల వారిని కూడా ఈ దిశలో ముందడగు వేయమని మనమంతా కోరవలసిన బాధ్యాతా ఉంది.

మన తెలుకు సాహితీ సంపద వెబ్ విశ్వంలో వెలుగొందాలంటే మనమందరం తప్పకుండా యూనికోడ్ ను ఉపయోగించాలి. వెబ్ విశ్వంలో మన తెలుగు ఏ మాత్రం వెనుక పడకూడదన్న చైతన్యం కలిగిన అసంఖ్య తెలుగు వీరులు తమ బ్లాగులద్వారా, ఎందరో వీకీపీడియన్లు జ్ఞానయజ్ఞంలోనూ స్వచ్ఛందంగా దివారాత్రాలు శ్రమిస్తుండం వలన నేడు కూడా మనం సగర్వంగా వెబ్ భాషలందునూ తెలుగు లెస్స యని చాటగలుగుతున్నాము. ఈ విషయం మరెందరిలోనో చైతన్యం నింపేదిశగా కూడా మనం ఇప్పుడే కదలాలి. సాహితి అండతో ‘వెబ్ లోకం’ కూడా అదే ప్రయత్నంలో ఉంది.

‘వెబ్ లోకం’ శీర్షికన ప్రచురితమయ్యే తదుపరి వ్యాసం – ‘తెలుగుకు యూనికోడ్ ను ఎలా ఉపయోగించాలి?’ తప్పక చదవగలరు.

(వెబ్ లోకం web lokam by Dr. C. Jaya Sankar Babu)

Thursday, August 14, 2008

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....

పతాకావిష్కరణ
- మన్నవ గంగాధరప్రసాద్, చెన్నపురి.
నేను
విహంగాన్ని
అపరిమిత స్వేచ్ఛాతత్వాన్ని
సున్నిత హృదయసంబరాన్ని.
నేను
ఒక సామాన్య మానవుణ్ని
సతతకివితాగాన లోలున్ని
బాధాసర్గశత కావ్యాన్ని
ప్రతిరోజూ మరణించే ఉదయాణ్ని
కాగితంపై జీవించే కలాన్ని
కాలాన్ని జయించే బలాన్ని
మది పుష్పాలను పండించే పొలాన్ని
దుర్మార్గహనన యజ్ఞవాటిక సిద్దం చేసే హలాన్ని.
కల్మశోన్మాధ వ్యతిరేక సైన్యాల యుద్దగీతాన్ని
కలసి కలలుగనే మనసుల భవితకు మార్గాన్ని.
సంకుచిత మనోదుర్గుణాలను పెకలించే గునపాన్ని
సమాజవనిలోని క్రూర వృక్షాల దహించే.. దావానలాన్ని.

Monday, August 4, 2008

మన తెలుగు manatelugu


మన తెలుగు పద్యాలు

మన తెలుగు వాజ్ఞ్మయం సదా స్మరించదగిన, గర్వించదగిన పద్యసంపదకు భాండాగారం. బహుశా దక్షిణాది భాషలలో ఈ విషయంలో తెలుగు తరువాతే మరే ఇతర భాషల పద్యాలైన అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి పద్యసంపదకు వారసులమైనందుకు కనీసం కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు పద్యాలను గురించి తెలుసుకొనడం తెలుగువారిగా మన కనీసధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడంలో మీకు తోడ్పడేందుకు చెన్నపురి తెలుగుకవి శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ సమ్మతించారు. సాహితి ద్వారా మన తెలుగు శీర్షికలో ప్రతి నెల ఆణిముత్యం లాంటి ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సత్ప్రయత్నానికి మన్నవగారు అభినందనీయులు. ఈ క్రమంలో మొదటి ఆణిముత్యం ...

గజేంద్రమోక్షం

ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందుఁబరమేశ్వరుఁడెవ్వడు మూలకారణం
బెవ్వఁడనాదిమధ్యలయుఁడెవ్వఁడు సర్వము దాన యైనవాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


ఎవనివలన జగము పుట్టి, పెరిగి, నశించుచున్నదో, ఎవ్వడు అన్ని జీవులకూ ప్రభువో, ఎవ్వడు అన్నిటికీ మూలకారణమో, ఎవరికి ఆది, అంతములు లేవో, ఎవడు సర్వాత్మస్వరూపుడో... అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.

గజేంద్రమోక్షం (పోతనామాత్య విరచితం) నుండి.

బాలసాహితిBALASAHITI

కథ

కోతి తెలివి


సి. విజయేంద్ర బాబు


ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది చాలా తెలివైనది. అది ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కింది. అది మర్రి తొర్రను చూసింది. దానిలో పక్షులు కవకవ అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయా అని చూసింది. ఒక పాము చెట్టుపైకి ఎక్కడం చూసింది. కొమ్మపై కూర్చున్న గద్దను పిలిచింది.


"నీకు పామంటే ఇష్టం కదా" అంది.


" అవును" అంది గద్ద.


"మరి తిను" అంది కోతి.


గద్ద పామును పట్టుకొని ఎగిరింది. ఆవిధంగా కోతి తెలివితో పక్షి పిల్లల్ని కాపాడింది.

చేతకాని వారిని కష్టాలనుండి తప్పించడం మంచి గుణం.

Friday, August 1, 2008

అంతరంగం


దేశ భాషలందు తెలుగు లెస్స యన్న అలనాటి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వాక్కును నేడు కూడా దేశ వెబ్ భాషలందు తెలుగు లెస్సయని నిరూపించిన తెలుగువీరులందరికీ కృతజ్ఞతాభివందనములతో సాహితి అక్షరయజ్ఞానికి నేడు శ్రీకారం చుడుతోంది. ప్రతి తెలుగు వీరుడు వెబ్ విశ్వంలో తెలుగువ్యాప్తికి తనవంతు అక్షరయజ్ఞానికి నడుంబిగించాలని ఆహ్వానం పలుకుతోంది సాహితి.
నేడు ఆధునిక విజ్ఞాన వికాసంతోపాటు భాషల మధ్య సాంకేతిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతర్జాలానికి అనువైన భాషగా మొదటినుండే రూపొందిన ఆంగ్లం అన్నిభాషలూ ఎదగనంత ఉన్నతస్ధాయికి ఎదిగిపోయింది. మన భాషలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చకపోయినా కంప్యూటర్లను ఆదరించి మనం సైతం ఆంగ్లంలోనే పనిచేస్తూ ఉండటం వల్లనే ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. యూనికోడ్ ఆవిష్కారంతో వెబ్ విశ్వంలో భారతీయ భాషల వికాసానికి, మన భాషలమధ్య సాంకేతిక అంతరాలను నిర్మూలించడానికి మార్గం సుగమమైంది. మనం తెలుగును వెబ్ విశ్వంలో దిగంతాలవరకూ వ్యాపింపజేసేందుకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగుపత్రికలు, ఇతర ప్రచారమాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఉపయోగించకపోవటంవల్ల మనం తెలుగు వ్యాప్తికి తీరని అన్యాయం చేస్తున్నామన్నది అక్షర సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని యూనికోడ్ ని ఉపయోగిస్తూ సుసమృద్ధమైన తెలుగు భాషా సంపదనూ, వాజ్ఞ్మయాన్నీ విశ్వవ్యాప్తంచేయటానికి మనం తక్షణం ముందడుగు వేయాలి. వీకీపీడియాలో ఎందరో నిస్వార్థ తెలుగువీరులు తెలుగు కీర్తిపతాకం ఎగురవేయటానికి నిరంతరం శ్రమిస్తుండటంచేత దేశభాషలందు తెలుగులెస్సయన్న వాక్కు వీకీపీడియాలోనూ నిరూపితమైంది. ఇంతటితో తెలుగు వెబ్ విశ్వంలో వికసించిందని సంతృప్తిచెందటం పొరపాటే. అన్నింటా మనం ముందున్నామనే సంతోషం మనకు మిగలాలంటే వెబ్ విశ్వంలో తెలుగుభాషకు తిరుగులేని వేదికగా యూనికోడ్ ను మనమందరం ఆదరించి ప్రయోగించవలసిన సమయమిదే. కంప్యూటర్ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరి సహకారంతో వెబ్ విశ్వంలో తెలుగు చైతన్యదీప్తిని ప్రసరింపజేయటానికీ, వెబ్ విశ్వంలో తెలుగు భాషా సాహిత్యాలవికాసంతో పాటు మానవతా విలువలను కాపాడటంలోనూ తనవంతు సహాయం ఉడుతాభక్తితో నెరవేర్చే సంకల్పంతో సాహితి ఈరూపంలో మీ ముందుకు వచ్చింది.
మంచి తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ, తెలుగువెలుగులూ, మానవతావిలువలూ దిగంతాలకు ప్రసరింపజేసే ప్రయత్నంలో సాహితికి తమరి ఆదరాభిమానాలే కొండంత అండ. వెబ్ విశ్వంలో ఈ అక్షర యజ్ఞానికి మీరు సైతం నడుం బిగించాలని సాహితి ఆహ్వానం పలుకుతోంది. తేనెలొలుకు తెలుగుభాషా మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు తమరు చేసే ప్రతి ప్రయత్నానికి సాహితి తనవంతు చేయూతను తప్పక అందిస్తుంది.

కొన్ని రచనలతో నేడు ప్రారంభమైన సాహితి నిరంతరం కొత్త రచనలతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మీరు ఏ రచన విషయంలో నైనా ఆ రచన చివరన ఉన్న comments పై క్లిక్ చేసి అక్కడే తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచవచ్చును. నిత్యమూ సాహితి సందర్శిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించవలసినదిగా కోరుతూ...
అక్షర అభివందనాలతో...


శ్రీవైష్ణవి విజయ్ రాధిక జయ శంకర బాబు

బాల సాహితి



అంజలి

- ఉప్పలధడియం రవితేజ

ఆ.వె. అమరజీవి వలన ఆంధ్ర రాష్ట్రము వచ్చె
దీని మరువరాదు తెలుగువారు
ఎక్కడున్నగాని ఎల్లప్పుడతనిని
తలచుకొనుట మనకు ధర్మమగును.

ముత్యాల సరములు

- ఉప్పలధడియం రవితేజ

పల్లెలోనూ పట్నమందూ
తేజుగాడూ అన్నపూర్ణా
ఒంటెమీదా ఓడలోనూ
తేజుగాడూ అన్నపూర్ణా
అప్పడాలూ, ఆవకాయా
ఎర్రగడ్డా, గనుసుగడ్డా
కందగడ్డా, ఉర్లగడ్డా
నాకుమాత్రం పట్టదోయ్.

పత్రికా సమీక్ష


తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న
నడుస్తున్న చరిత్ర


- డా. సి. జయ శంకర బాబు


తెలుగు భాషా సంస్కృతుల ప్రచారమే ధ్యేయంగా తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న నడుస్తున్న చరిత్ర గత 16 సంవత్సరాలుగా విజయవాడ నుండి నిరంతరాయంగా వెలువడుచున్నది. వివిధ ప్రాంతాలలో, వృత్తులలో, జనజీవనంలో ఉన్న పదాలవాడుక పెంచుతూ, ఇతర భాషాపదాలను అనవసరంగా ఉపయోగించకుండా తెలుగును ఉమ్మడి ప్రామాణిక భాషగా రూపొందించుకుందామన్నది ఈ పత్రిక ప్రచురణకర్తల వాక్కు. అవసరమైతే మనభాషలోనే కొత్త పదాలను తయారుచేయండనే సందేశాన్ని ఈ పత్రిక అందిస్తోంది. ఈ సందేశంలో వ్యావహారికత గురించి మనమాలోచిస్తే మనకు లభించే నిష్కర్షేమిటంటే కొత్త పదాలెన్ని తయారుచేసినా వాటి వాడుక చాలా ముఖ్యం. తెలుగు దిన పత్రికలలో, సినిమాలలో, బుల్లితెర కార్యక్రమాల్లో అటువంటి పదాలను నిరంతరం ఉపయోగిస్తే అవి జనజీవన స్రవంతిలో కలిసిపోగలవు. అన్ని తెలుగు ప్రచారమాధ్యమాలలో ఇలాంటి చైతన్యాన్ని నింపేదిశగా నడుస్తున్న చరిత్రతో పాటు మనమూ పురోగమిస్తే తెలుగుతేజాన్ని నలుదిశలా వ్యాపింపజేయటం సాధ్యమే.
విభిన్న ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సమైక్యతనూ, తెలుగుభాష ఔన్నత్యాన్నీకాంక్షిస్తూ నడుస్తున్న చరిత్రలో సంపాదకులు సోమల రమేష్ బాబు గారు రాస్తున్న సంపాదకీయాలు భాషాచైతన్యాన్ని పెంపొందించుకోవాలన్న తపన గల ప్రతి తెలుగు వాడి నాడికి సరికొత్త స్పందననందిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. ఉద్యమచైతన్యంతో ముందుకు సాగుతూ తెలుగుజాతి వేదికగా రూపందుకున్న ఈ పత్రికలో తెలుగు భాషా, సంస్కృతులపై వ్యాసాలు, పరిశోధనా ఫలితాలే కాకుండా తెలుగువారికి సంబంధించిన వర్తమాన సంఘటనలు, సాహితీరంగవార్తలు, కథ, కవితలు పత్రిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటీవలే వెలువడిన జూలై 2008 సంచికలో సంపాదకహృదయం ‘తెలుగుజాతి కోసం పోరాడే రాజకీయం కావాలి’ అన్నశీర్షికతో రాసిన సంపాదకీయంలో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశ సంఖ్య 76/10-6-2008 పట్ల ఆవేదన, వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమౌతోంది. ‘తెలుగు భాషా పదసంపదను కాపాడుకోవడానికి ఏంచేద్దాం?!’ అంటూ చూపు శీర్షికలో జయధీర్ తిరుమలరావుగారి పరిశోధనాత్మక వ్యాసం, తెలుగు సిరి శీర్షికన ‘తెలుగు క్లాసికల్ భాష కాదా?’ అంటూ ప్రశ్నిస్తూ ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు తమ వ్యాసంలో గిడుగు సీతాపతిగారు కేంద్రసాహిత్య అకాడమీకి వ్రాసిన సాహిత్యచరిత్రలో ఉన్న అబద్దాలే తమిళులకు పనికివచ్చాయని ఉద్ఘాటించారు. వాస్తవానికి మనం ఇటువంటి అబద్దాల పుట్టలు పెరుగుతున్న సందర్భాలలో వెంటనే స్పందించకపోవటంవల్లనే ఇటువంటి గ్రంథాలు ప్రామాణిక గ్రంథలైపోతున్నాయేమోననిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన విషయంలో ఏ గ్రంథమైనా ప్రామాణికతను పొందుతోందంటే అందులో ఉన్న నిజాలైనా, అబద్దాలైనా మనం మౌనంగా అంగీకరించబట్టే. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. సుందరం మేష్టారుగారిలాంటి వారు తమకలాల్ని ఝళిపిస్తే తెలుగుకు ఎంతోకొంత మేలు చేకూరుతుంది, సత్యమేవ జయతేకూ సార్థకత సిద్ధిస్తుంది. వ్యాఖ్యానం, తెలుగుతనం, స్వాభిమానం, పరిశోధన, న్యాయపీఠం, జ్ఞాపకాలదొంతర, అన్వేషణ మొదలైన ఆకర్షణీయమైన శీర్షికలలో రచయితలు ఆసక్తికరమైన విషయాలపై తమ భావాలను వ్యక్త పరిచారు. పరామర్శ ప్రణామం శీర్షికన పుస్తక సమీక్ష, గ్రంథాలయం శీర్షికన గ్రంథస్వీకారం సచిత్రంగా ప్రచురించారు. స్పందన శీర్షికలో గత సంచికలలోని రచనలపై పాఠక స్పందనకు స్థానందక్కింది. తెలుగువాణి సారథ్యంలో తెలుగుసంఘాల సమైక్యతలో 5, 6 జూలై 2008 న తిరుచ్చిలో ఘనంగా జరిగిన దక్షిణ భారత తెలుగు పల్లెకళల పండుగకు సంబంధించిన సచిత్రవార్తలతోపాటు పూజకుణిత కళారూపం ముఖచిత్రంగా వెలువడిన ఈసంచిక అవశ్యం పఠనీయం. నడుస్తున్న చరిత్ర ప్రతి సంచికలోనూ తెలుగు నవచైతన్యదీప్తి గోచరిస్తోంది. నేటి సాంకేతిక యుగంలో తెలుగుభాష ఔన్నత్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వెబ్ విశ్వంలో విస్తరిస్తున్న తెలుగు ఆనవాళ్ళగురించికూడా ఈపత్రికలో స్థానం కల్పిస్తే పత్రిక భాషాఉద్యమస్ఫూర్తికి సంపూర్ణత చేకూరుతుంది. రాబోయే సంచికలలో ఈ దిశగా ప్రయత్నించగలరని సాహితి ఆశిస్తోంది.

కవిత

అతివాదం విశ్వరోగం

- ఏ. రాధిక

ఊయల ఊగదాయె
జోలపాట మూగబోయె
పైరుగాలి నాట్యమాగె
సెలయేరు హోరు మరచె

కన్నతల్లులెందరో గుండెలవిసేలా
రోదనలు మిన్నంటేలా
ఎటుచూసినా ఆ ఏడుపే మారుమ్రోగె

గుండెల్లో భయం, కాలు బయట పెట్టాలంటే భయం
మెన్న దేశ సేవలో వందల జవాన్లు
నిన్న అన్నం పున్నెమెరుగని అమాయకపు ప్రజలు
నేడేమో.... రేపోమో.... ఎన్నాళ్ళీ భయం
కన్న తల్లులకీ గర్భశోకం
మనిషిని చూస్తే మనిషికి భయం
ఏ జాతి జీవికి లేని వింతరోగం
బాంబులు, మానవబాంబులతో విధ్వంసం సృష్టంచే విశ్వరోగం
అతివాదానిదదే అసలు స్వరూపం

ఏ ప్రభుత్వాలు మార్చలేవు, ఏమార్చనూలేవు
మతాలు కులాలన్నవి మట్టికరిచే దాకా
మనసున ఆ అంతర్యామి రూపం ఒక్కటిగా కనపడుదాకా
ఈ రోగం మానదు, ఈ శోకం ఆగదు

పెరుగుతున్న విజ్ఞానం మనిషిని మనిషికి
దగ్గర చేయాలని మన అందరి ఆశ
అది పెడదోవ పట్టి మనిషికి మనిషికి మద్య
అగాధం సృష్టిస్తుంటే ఆదిమ మానవుడైపోతేనే నయం
అపుడీ రోగాలేవి ఉండవన్న ఆశాభావం.

(ATIVAaDAM VISHVAROGAM – A Telugu Poem by A. Radhika for SAAHITEE)

Wednesday, July 23, 2008

అనుసృజన anusrijana TRANSLATION

కథ


భార్య

హిందీ మూలం – జైనేంద్ర కుమార్

తెలుగు అనువాదం – డా. సి. జయ శంకర బాబు

ఊరికి ఓమూలన ఉన్నది ఆ ఇల్లు. ఆ ఇంట్లో మొదటి అంతస్తు. అక్కడ వరండాలో ఒక స్త్రీ కుంపటి ముందు కూర్చొని ఉంది. కుంపట్లో నిప్పులు బూడిదైపోతున్నాయి. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంది. దాదావు ఇరవై - ఇరవై రెండు మధ్య వయసు ఉండవచ్చు. చూడటానికి బక్క పలుచగా, మంచి సంస్కారవంతమైన కుటుంబానికి చెందినదిలా ఉంది.
ఉన్నట్టుండి ఆమె ధ్యాస నిప్పులు బూడిదైపోతున్న కుంపటి వైపు మళ్ళింది. మోకాటిపై చేతులు మోపి ఆమె పైకి లేచింది. కొన్ని బొగ్గులు తెచ్చి కుంపట్లో వేసి మళ్ళీ ఓ మూలన కూర్చుంది, ఇప్పుడేంచేయాలో గుర్తు చేసుకుంటున్నట్లు. ఇంట్లో ఎవరూ లేరు. సమయం మధ్యాహ్నం పండ్రెడు కావస్తున్నది.
ఈ ఇంట్లో ఉంటున్నది ఇద్దరు జీవులే, భార్య – భర్త. భర్త ఉదయాన వెళ్ళి ఇప్పటిదాకా తిరిగి రాలేదు. భార్య వరండాలో కూర్చొని ఉంది.
ఆమె సునంద.... ఆలోచిస్తూ ఉంది - లేదు, తనెక్కడ ఆలోచిస్తోంది, అలసట చెంది అలా అక్కడ కూర్చొని ఉంది. ఆలోచించడమంటే ఒక్కటే..... అదేమంటే నిప్పులు ఆరిపోకూడదు అని. ఆయన ఎప్పడొస్తాడో మరి. ఒంటిగంట అవుతోంది. ఏది ఏమైనా, ఆయన తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా.... ఇంకా సునంద కూర్చొనే ఉంది. ఆమె ఏమీ చేయటం లేదు.
ఆయన వచ్చినపుడు రొట్టె చేసి పెడుతుంది. ఆయన ఎక్కడుండి ఇంత ఆలస్యం చేస్తాడోమరి. తను మాత్రం కూర్చోలేకపోతోంది. నిప్పులు రాజుకున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా కుంపటిపై పెనం పెట్టేసింది. ఇలా చూస్తూ ఉంటే కాదు, ఇక తను రొట్టె చేసేస్తే సరి. ఆమె గభాలున పిండి ఉన్న పాత్రను దగ్గరికి లాగి రొట్టెలు చేయడం మొదలు పెట్టింది. కొద్ది సేపటి తర్వాత మెట్లపై పాదాల చప్పుడు వినిపించింది. ఆమె ముఖంలో వెలుగు నిండి క్షణంలో ఆ వెలుగు ముఖంపై నుండి మాయమైపోయింది. ఆమె అలానే తన పని చేస్తూ ఉండి పోయింది.
భర్త కాళిందీచరణ్ వచ్చాడు. తనతో పాటు ఆయన ముగ్గురు మిత్రులు కూడా వచ్చారు. వారు తమలో ఒకరితో ఒకరు మాట్లాడుతూ వస్తున్నారు.... చూస్తే చాలా ఉత్తేజంగా అగుపిస్తున్నారు. కాళిందీచరణ్ తన మిత్రులతో పాటు సరాసరి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. వారి మధ్య ఏదో చర్చ జరుగుతోంది. గదిలోనికి ప్రవేశించగానే ఆగిన చర్చ మళ్ళీ మొదలైంది. ఆనలుగురూ దేశాన్ని ఉద్ధరించాలని నడుం బిగించిన వాళ్ళు. అదే విషయమై చర్చ జరుగుతోంది. భరతమాతకు స్వాతంత్ర్యం సంపాదించాలి.... నీతి-అవినీతి, హింసా-అహింసల గురించి ఆలోచించేందుకు ఇది సమయం కాదు. తియ్యటి మాటలతో ఒరిగేదేంటో చాలా చూశాము. పులి నోట్లో పెట్టిన తలను తియ్యటి మాటలతో తియ్యలేము. అటువంటి­­ సమయంలో పులిని చంపడమే ప్రత్యామ్నాయము. ఉగ్రులవ్వాలి! అవును ఉగ్రతే. తీవ్రవాదమంటే మనం ఎందుకు భయపడాలి? ప్రజలంటారు తీవ్రవాదులని, మూర్ఖులని, ఏమీ ఎరుగని పిల్లతనమని..... అవును పిల్లగాళ్ళూ, మూర్ఖులూనూ, వారికి పెద్దరికం, బుద్ధి కల్గినతనం అక్కరలేదు... మనకు జీవించాలనే కోరిక లేదు. మనకు పిల్లల పట్ల మోహమూ లేదు. ధన సంపదలు అర్జించాలన్న ధ్యాస లేదు. అలాంటప్పుడు మనకు చచ్చేందుకు స్వేచ్ఛ ఎందుకు లేదు? దౌర్జన్యాన్ని ఆపటానికి కొంత దౌర్జన్యం జరగవలసిందే. దౌర్జన్యమంటే భయపడేవాళ్ళే దానికి భయపడాలి. మనం యువకులం, మనకు భయంలేదు.
చర్చను కొనసాగిస్తూ తాము ఏం చేయాలన్నది నిర్ణయించసాగారు.
ఇంతలో తాను భోజనం చేయలేదనే ధ్యాస కాళిందీచరణ్ కు కలిగింది, తన మిత్రుల భోజనం గురించి కూడా అడగలేదే అన్పించింది. మిత్రులతో క్షమించమని అడిగి సునంద కోసమై వెలుపలికి వచ్చాడు.
సునంద ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. ఆమె రొట్టెలు చేయటం పూర్తి చేసింది. కుంపటిపై అప్పడే మూతపడి ఉంది. చేతివేళ్ళపై తల ఆన్చి ఆమె కూర్చోనిఉంది. ఏదో కోల్పోయినదానిలా కన్పిస్తున్నది. భర్త కాళిందీచరణ్ తన మిత్రులతో ఎందుకు – ఏమి మాట్లాడుతున్నాడో వింటూ ఉంది. ఆ ఉత్తేజానికి కారణం ఆమెకు బోధపడదు. ఉత్సాహమంటే ఏమిటో తెలియదు. అది ఆమెకు దూరమైన వస్తువు.... స్పృహనీయమైన, మనోహరమైన భావన. భారతమాతకు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆమె తపన. కానీ ఆమెకు భరతమాతా అర్థం కాదు, స్వేచ్ఛయూ తెలిసిరాదు. వాళ్ళు ఉత్తేజంతో మాట్లాడుకుంటున్న మాటలకు అర్థం ఆమెకు తెలియదు. కానీ, ఉత్సాహంకోసం ఆమె తపిస్తూ ఉంటుంది. జీవితంపై ఆశ సన్నగిల్లుతూ ఉంది, అయినా ఆమెకు జీవించాలని ఉంది. భర్త తనతో దేశం గురించి మాట్లాడాలని ఆమె ఆశ. తనకు బుద్ధి కొంచెం తక్కువే... అయినా నిదానంగా విషయాన్ని అర్థం చేసుకోలేక పోదు కదా? ఆమె ఆలోచనలో మునిగిపోయింది. అవును తక్కువ చదివినదాన్నే అయినా ఇందులో నా తప్పేముంది? ఇప్పుడు నేను చదవటానికి సిద్ధమే, కానీ భార్య పట్ల భర్తకు బొత్తిగా నమ్మకం కుదరటం లేదు. ఓహ్ ఆయనేమో సేవ చేయడమే దీని పని అనుకున్నాడు. అంతే, ఇది తెలిసే ఏదీ తెలుసుకోవాలన్న కోరికను కూడా వదులుకున్నాను. ఆమె ఎప్పుడూ భర్త దారికి అడ్డురావాలని ఆలోచించదు, అప్రయత్నంగానే భర్తకు సహకరిస్తుంది. ఒక్క విషయం మాత్రం ఆమెకు తెలుసు... భర్త అసలు విశ్రమించడమంటే ఎరుగకపోవటం, అన్నీ తెలిసి ఏదో పోగోట్టుకొన్నవాడిలా అలా తిరుగుతూ ఉంటాడు, ఇందులో ఆయన ఏదో మంచే ఆలోచిస్తుంటాడు. ఇలా భావించే తను ఎటువంటి అడ్డూ అదుపూ లేకుండా భర్తతో పాటు విపత్తులపై విపత్తులు కొనితెచ్చుకుంటోంది. నువ్వు నాతోపాటెందుకు కష్టపడుతున్నావని భర్త తనను ప్రశ్నించాడు కూడా. అయినా విని తను మిన్నకుండిపోయింది. ప్రభుత్వమని దేన్నయితే అంటున్నారో ఆ ప్రభుత్వమే వారి ఇటువంటి పనుల పట్ల చాలా కోపంతో ఉంది. ప్రభుత్వము ప్రభుత్వమే. ప్రభుత్వమంటే ఏమిటో ఆమెకు స్పష్టంగా బోధపడుట లేదు, అయినా పాలకుల పేరిట ఎందరైతే ఉన్నారో, వారంతా ఎంతో బలం కలిగి ఉంటారు, వారి వద్ద ఎన్నో బలీయమైన శక్తులుంటాయని, ఇంతటి సైన్యం, పోలీసు సిపాయిలు, మేజిస్ట్రేట్లు, మున్షీలు, చప్రాసీలు, జైలు అధికారులు, వైస్రాయ్ వీరంతా ప్రభుత్వమే. వీరందరితో ఎలా పోరాడటం. పాలకులతో వైరము మంచిది కాదు, అయినా ఈయన వారితో పోరాడటానికి తనువు-మనువు మరిచాడు. అది సరే, వీళ్ళంతా ఇంత బిగ్గరగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే తనకు నచ్చదు. మామూలు దుస్తుల్లో (మఫ్తీ) గూఢాచారి పోలీసు ఎప్పుడూ ఈ ఇంటి బయటే తచ్చాడుతూ ఉంటాడు. వీళ్ళు ఆవిషయమెందుకు మర్చిపోతున్నారు? ఇంత బిగ్గరగా ఎందుకు మాట్లాడుతారు?
ఇటువంటి విషయాలే ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. అదిగో, సమయం రెండు కావస్తున్నది. ఆయనకు తిండి ధ్యాస లేదు, నా ధ్యాస లేదు. నా గురించి లేకున్నా ఫరవాలేదు, కనీసం తన ఒళ్ళు గురించైనా ధ్యాస ఉండాలి కదా. ఇలాంటి నిర్లక్ష్యంవల్లే పిల్లవాడుకూడా దక్కలేదు. ఆమె మనసును ఎటుమళ్ళించినా, అది అటూ-ఇటూ తిరిగి చివరికి సంతానలేమి విషయంవైపే మల్లుతుంది. అప్పుడు ఆమెకు పోగోట్టుకున్న తన కోడుకు జ్ఞాపకాలే వస్తాయి – అందమైన పెద్దకళ్ళు, చిట్టి-చిట్టి వ్రేళ్ళు, ముద్దొచ్చే చిట్టి-చిట్టి పెదవులూ. అన్నీ ఇవే జ్ఞాపకాలు. పిల్లచేష్టలూ గుర్తుకు వస్తాయి. అన్నింటికి మించి వాడి చావూ గుర్తుకొస్తుంది. ఓహ్, అదెటువంటి చావు? ఆ చావును ఆమె చూడలేని స్థితి. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదని ఆమెకు తెలుసు – తనూ చావాల్సిందే, తన భర్తయూ చావాల్సిందే, కానీ పసిగుడ్డు ప్రాణం పోగొట్టుకున్న తీరు జ్ఞాపకం వచ్చిన క్షణం భయం ఆమెను ఆవహిస్తుంది. ఇది సహించడం ఆమె వల్ల కాదు. పిల్లాడి జ్ఞాపకం ఆమెను కలచివేస్తుంది. అప్పుడు ఆమె దుఃఖభారంతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నట్టుండి ఏదో పని వెదుక్కోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఒంటరిగా ఉండటంవల్ల తను ఏమి చేసినా మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం – అదే తన పసిగుడ్డు ప్రాణం తనముందే పోతున్నట్టు, ఇలానే ఆమె మనసు దైన్యస్థితికి చేరుకుంటుంది. ఆమె లేచింది. ఇప్పుడు లేచి వంట పాత్రలు కడగాలి, వరండా కూడా శుభ్ర పరచాలి. ఓహ్, ఖాళీగా కూర్చోని నేనేం ఆలోచిస్తున్నాను.
ఇంతలో కాళిందీచరణ్ వరండాలోకి వచ్చాడు. సునంద అన్యమనస్కంగానే ఉండిపోయింది. తను భర్త వైపు చూడలేదు.
కాళిందీ అడిగాడు – సునందా భోజనానికి మేము నలుగురున్నాము. వంట పూర్తయిందా ?
సునంద పిండి కలిపిన కంచం, పీట, లక్కెన, బానలి మొదలైన ఖాళీ పాత్రలు తీసుకొని లేచి పోయింది, ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
సునంద ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో కోపం పెల్లుబుకుతోంది. క్షమాయాచకురాలైన తనతో ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇంకొంచెం అన్నం వండమని నవ్వుతూ ఎందుకు చెప్పడు. నేనేదో పరాయిదాన్నయినట్లు. మంచిది, నేనేం బానిసనుకాదు కదా, ఈయన పనే చేస్తూఉండటానికి. అన్నం గిన్నం నాకేం తెలియదు. ఆమె మిన్నకుండి పోయింది.
కాళిందీచరణ్ గట్టిగా పిలిచాడు – సునందా.
తన చేతిలోనున్న బానలిని విసిరి కొట్టాలనిపించింది సునంద మనసులో. తను ఎవరికోపాన్నీ సహించేందుకు లేదు. ఇంతవరకు తను భర్తగురించి, ఆయన బాగోగులు గురించి ప్రీతికరమైన విషయాలెన్నో ఆలోచిస్తూ ఉండిపోయిన సంగతి ఆమె జ్ఞాపకాలజాడలోనికి రాలేక పోయింది. ఇప్పుడు కోపంతో లోలోపలే నలిగిపోయింది.
ఏం మాట్లాడలేవా ?
సునంద మాట్లాడలేదు.
సరే మంచిది. మేమెవ్వరూ తినం.
ఇలా అంటూ ఉద్రేకంతో కాళ్ళు చరస్తూలోనికి వెళ్ళిపోయాడు.
కాళిందీచరణ్ తమదళంలో ఉగ్రుడని ఎప్పుడూ అనిపించుకోలేదు, ఎంతోకొంత ఉదారుడే అనించుకొన్నాడు. తమదళంలో ఉన్నది చాలావరకు అవివాహితులే, కాళిందీచరణ్ వివాహితుడు మాత్రమే కాదు, ఒక కొడుకును పోగుట్టుకొన్నవాడు కూడాను. ఆయనమాటంటే దళంలో ఎంతోగౌరవం. ఆయన నెమ్మదితనం కొందరికి పడదుకూడాను. తమదళంలో వివేకానికి ఆయన ప్రతినిధి. ఉద్వేగానికి అంకుశంలా వ్యవహరిస్తుంటాడు.
ఇదే విషయమే తమ చర్చలోను చోటు చేసుకుంది. తాము ఉగ్రవాదాన్ని వదిలేదిశగా కదలాలన్నది కాళిందీ అభిమతం. ఉగ్రవాదంలో వివేకం అవిటిదైపోతుంది. దీంతో మనిషి ఉగ్రుడిగా ఉండిపోతాడు లేదా దాని భయంతోటే అణిగి ఉంటాడు. ఈ రెండు పరిస్థితులూ మంచివి కావు. బుద్ధిని నలువైపులనుండి వికసింపజేయటమే మన లక్ష్యం. దాన్ని తీవ్రతరం చేయటం మాత్రమే కాదు. ప్రభుత్వం వ్యక్తి, జాతి వికాసమే లక్ష్యంగా దాన్ని అణచివేయాలని చూస్తుంది. మనం ఈ వికాసమార్గంలో అవరోధాల్ని తొలగించాలన్నదే మన కోరిక. దీన్ని స్వేచ్ఛాయుతం చేయాలన్నదే మన తపన. తీవ్రవాదంతో ఇది సాధ్యం కాదు. అధికారమదంతో ఉన్మత్తులయిన వారి మదాన్ని అణచి, వారిలో కర్తవ్యభావాన్ని నింపటమే మన అసలైన కార్యం. వారిలోని ఆ మదం వారికి ఎదురుతిరిగి దెబ్బతినే అణుగుతుంది. ఇటువంటి దెబ్బతీయటానికి మనం సన్నద్దులై ఉండాలి, అంతేకానీ ఇలాంటి చిరు తగవులు మంచివి కావు. ఇలాంటివాటిచే ప్రభుతకు జరిగే నష్టమేమీ ఉండదుగానీ, తన ఔచిత్యంపై ఎంతో హర్షిస్తుంది కూడా.
కానీ సునంద దగ్గరికెళ్ళి తిరిగి వచ్చాక కాళిందీ మాటల్లో తేడా కనిపించింది. తన పంథాపై తాను ధృఢంగా ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు తను ఉగ్రవాదం కూడా అనివార్యమే అనే ధోరణికి వచ్చాడనిపించింది. అవును, మనం ఒక పని తప్పక ఆరంభించాలి అంటూ మీకు ఆకలిగా లేదా? ఆమె ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఇక్కడ బోజనం తయారుకాలేదు. ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడైనా హోటలుకు వెళ్దామా? అన్నాడు కాళిందీ.
బజారునుండి ఏదో ఒకటి ఇక్కడికే తెచ్చుకుంటే సరియని వారిలో ఒకడన్నాడు. మరొకడేమో హోటలుకు వెళ్దాం పద అన్నాడు. ఇలా వారు మాట్లాడుతున్నంతలోనే సునంద ఒక పెద్ద కంచంలో అన్నం తెచ్చి వారి మధ్య ఉంచింది. అది అక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి నాలుగు గ్లాసులలో మంచినీళ్ళు తెచ్చిపెట్టి మౌనంగా వెళ్ళిపోయింది.
కాళిందీకి పై ప్రాణం పైనే పోయినట్లయింది.
ముగ్గురు మిత్రులు ఊరకుండిపోయారు. భార్యా-భర్తలమధ్య మనస్పర్థలేవో ఉన్నాయని వారికి అర్థమైపోయింది. చివరికి ఒకడన్నాడు సరే తినడం మొదలుపెడదామా అని. ఇది మనకు చాలదేమో అన్నాడు కాళిందీ సిగ్గుతో. చాలా ఉంది, సరిపోతుందిలేనని ఇంకొకడన్నాడు.
ఇంకొంచెం ఉందేమో చూద్దును, అంటూ కాళిందీ పైకి లేచాడు.
సునంద దగ్గరికి వచ్చి – అన్నం అక్కడ తెచ్చిపెట్టమని నీతో ఎవరన్నారు? నేనేమన్నాను?
సునంద పలకలేదు.
పద వెళ్ళ ఆ కంచం తెచ్చెయ్. మేమెవరూ ఇక్కడ తినము. హోటలుకు వెళ్తాం.
సునంద మాట్లాడలేదు. కాళిందీ కాసేపలాగే నిల్చుండిపోయాడు. ఆయన మనసులోనూ, కంఠంలోనూ ఏవేవో ఆలోచనలు-మాటలు కదులుతున్నాయి. తనకు అవమానం జరిగినట్లుగా భావించాడు. ఆ అవమానం తనకు భరింపరానిది.
ఏం వినపడ్డం లేదా ఎవరేమంటున్నారో అతనన్నాడు.
సునంద ముఖం తిప్పుకుంది.
నేనరుస్తూ ఉండటానికే ఉన్నాననుకున్నావా ?
సునంద లోలోపలే కుమిలి పోయింది. నేను చెప్పివెళ్ళాక కూడా అన్నం ఎందుకు తెచ్చి పెట్టావని నేనడుగుతున్నది ? సునంద ప్రక్కకు తిరిగి జంకుతూ సన్నటి గొంతుతో – తినరా ఒగ్గంటైపోయింది.
కాళిందీకి ఏంచేయాలో పాలుపోలేదు. ఇదింకా విచిత్ర పరిస్థతిలా ఉందనిపించింది. ఇంకా అన్నం లేదా అంటూ గద్దించాడు.
సునంద మెల్లగా అంది – పచ్చడి తీసుకువెళ్ళండి.
ఇంకా అన్నం లేదా? సరే, ఆపచ్చడివ్వు.
సునంద పచ్చడి తెచ్చింది, అది తీసుకొని కాళిందీ లోనికి వెళ్ళపోయాడు.
సునంద తన కోసం కొంచమైనా అన్నం తీసిపెట్టుకోలేదు. తను కూడా తినాలి కదా అన్న తలంపైనా ఆమెకు కలగలేదు. ఇప్పుడు కాళిందీ వచ్చి తిరికి లోపలికి వెళ్ళాక తన కొరకు తాను అన్నం అట్టిపెట్టుకోలేదని అర్థమైంది. తనపై తనకే జాలి కలిగింది. ఆమె మనసు కఠోరమైంది. అవును తన కొరకు మాత్రం కాదు...ఇలా ఆలోచించినందుకు ఆమె మనసు కఠోరమైంది. ఛ! ఇలా ఆలోచించటం సరియేనా, తనలోనూ విషం నిండుతోంది. ఇలా ఆలోచిస్తూనే ఆమె మనసులో మెదిలింది మరో ఆలోచన. అది సరే, కనీసం నువ్వేం తింటావ్ అనైనా ఆయన అడగలేదే అని. తను తిని ఆయన మిత్రుల్ని ఆకలితో పంపేయాలనే తలంపులను అసలు తను సహిస్తుందా ? అయినా ఆయన అడిగితే ఏమయింది. ఈ విషయమై ఆమె మనసు కృంగిపోయింది. తనకు కాస్తో కూస్తో ఉన్న గౌరవం కూడా పోగొట్టుకొన్నట్లు ఊగి పోయింది. ఉండి ఉండి తనను తాను కించపరచుకుంటూ ఛ ఛ ! సునందా, నీకు ఇంత చిన్న విషయంపైకూడా పట్టింపా ? వారికోసం ఒకరోజు ఉపవాసమున్న పుణ్యం దక్కిందని సంతోషించాలి గానీ. అసలు నేనెందుకు ఆయనకు కోపం తెప్పిస్తున్నాను ? ఇక నుండి కోపం కలిగించను. కానీ ఆయన మాత్రం తన గురించి తాను పట్టించుకోడు. ఇది మంచిది కాదు. నేనేం చేయాలి ? తనలో తాను మథన పడి పోయింది.
లేచి పాత్రలు తోమటం మొదలు పెట్టింది. లోపల వాళ్ళేమో బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో వాళ్ళ నవ్వులాటలు ఆమెకు విన్పిస్తున్నాయి. అయ్యో పాత్రలు తరవాతైనా కడుక్కోవచ్చు. లోపల వాళ్ళకేమైనా అందివ్వాలేమో ఇలా ఆలోచించి వెంటనే చేతులు కడుక్కొని లేచివెళ్ళి ఆగది తలుపు ప్రక్క గోడకు ఆనుకొని నిల్చుండిపోయింది.
ఒక మిత్రుడన్నాడు – పచ్చడి ఇంకా ఉందా ఇంకాస్త తెప్పించు గురూ
అలవాటు ప్రకారం కాళిందీ బిగ్గరగా – ఏమేయ్ పచ్చడి, పచ్చడి తీసుకురావే అన్నాడు. సునంద ఎక్కడో దూరంగా ఉన్నట్లు. కానీ ఆమె తలుపు దగ్గరే ఉంది. మౌనంగా పచ్చడి తెచ్చి పెట్టింది.
వెళ్ళిపోబోతుంటే కొంచెం అనిగిన గొంతుతో కాళిందీ అన్నాడు – కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టు.
సునంద నీళ్ళు తెచ్చిపెట్టింది. బయటికి వెళ్ళి మళ్ళీ తలుపు ప్రక్కన నిలబడింది, కాళిందీ ఏదైనా అడిగితే తెచ్చిపెట్టాలని. ~
---

కవిత KAVITA

నాన్న

డా. ఎస్. బషీర్, చెన్నయ్

జీవితాన్ని, అనుభవాన్ని
శ్రమను, మేధను
అహర్నిశలు ధారపోస్తూ
శిలలను, సజీవ శిల్పాలుగా మలిచే
అద్భుత అమర శిల్పి - నాన్న


--

కుటుంబ సౌభాగ్యాన్ని
సంతాన శ్రేయస్సును కాంక్షిస్తూ
నవ తరాన్ని, భావి తరాన్ని
ప్రగతి పథం వైపుకు నడిపించే
మార్గదర్శి, దూరదర్శి నాన్న

--

కుటుంబ చరితలో...
తన వాళ్ళ నిండు మనస్సుల్లో...
మైలురాయిగా, స్థిరంగా
నిలిచిపోయే శిలాక్షరం, కీర్తి స్థంభం నాన్న

--

తనకోసం ఏమీ మిగుల్చుకోక పోయినా
తన సంతానం కోసం ఎన్నటికీ తరగని
విజ్ఞాన ధనం, సిరి సంపదలు,
ప్రసాదించే ధన్యజీవి, అమరజీవి నాన్న

--

ఐనవారి సుఖం కోసం
కొవ్వొత్తిలా వెలుగునిస్తూ
కరిగి పోయే కర్మజీవి నాన్న

--

అంధకారంలో ఉన్నా
తనవాళ్ళకు వెలుగు ప్రసాదించే
టార్చిలైటు-మార్గదర్శి నాన్న

--

తాను కాలిపోయినా
తన వారికి సువాసనలు వెదజల్లే
అగరొత్తి నాన్న

--

తాను కాలే కడుపుతో ఉన్నా
తన వాళ్ళకు పరమాన్నం పంచిపెట్టే
అక్షయ పాత్రధారి నాన్న

--

తన బతుకు అరణ్యరోదనైనా
తనవాళ్ళ బతుకుల్ని సంగీతభరితం చేసే
అద్భుత గాత్రధారి నాన్న

--

సాహితికి రచనలు ఎలా పంపాలి ?



తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బృహద్ ప్రయత్నంలో ఉడుతా భక్తితో తోడ్పాటునందించాలనే సత్సంకల్పంతో ఈ అక్షర యజ్ఞానికి తమ సహాయ సహకారాలతో సాహితి ఆగస్టు 2, 2008 న శ్రీకారం చుడుతుంది. ఈ చిరు ప్రయత్నానికి తమ ఆత్మీయతను అందించగలరు. దేశ భాష లందే కాక ప్రపంచ భాషల మధ్యకూడా తెలుగు వైభవాన్ని చాటిచెప్పే సులభమైన అవకాశం ఇంటర్నెట్ కల్పిస్తున్నందున మన భాషా సాహిత్యాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఇది మంచి తరుణం. తెలుగులో ఉన్న పరమోత్కృష్టమైన సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయటం, వివిధ భాషలలోకి తర్జుమా చేయడం, వివిధ భాషల మాధ్యమంగా ఆయా భాషలవారికి తెలుగు నేర్చుకునే అవకాశం కల్పించడం తదితర ప్రయత్నాలు మనం ఈ తరుణంలో నిష్ఠగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తేనెల తేటల మాటలతో మన తెలుగు వెభవాన్ని చాటిచెపుతూ విశ్వవ్యాప్తంగా మానవీయ విలువలను, శాంతిని కాపాడే ప్రయత్నంలో సాహితి కి తమ చేయుతను, ఆదరణను అందించగలరు. తమ ఆదరణే సాహితి కి ఊపిరి, ప్రాణం కూడాను. తెలుగు రచనలే కాకుండా వివిధ భాషలలో తెలుగు సాహిత్యానువాదాలకు, తెలుగు వైభవ సుగంధాలను వెదజల్లేందుకు మరే ఇతర భాషలోనైనా రచనలకు సాహితి స్వాగతం పలుకుతోంది.
సాహితికి రచనలు ఎలా పంపాలి ?
సాహితి కి ఇదివరకు ప్రచురితం కాని మౌళిక రచనలు ఈ-మెయిల్ ద్వారా పంపగలరు. సాహితి లో ప్రచురితమైన తర్వాత మరే పత్రికకైనా నిరభ్యంతరంగా పంపవచ్చును, కానీ సాహితి వెబ్ పత్రిక లో ప్రచురితమైనట్టు సూచించగలరు. ఇదివరకే ముద్రిత పత్రికలలో ప్రచురితమైన మంచి రచనలను కూడా సాహితిలో ప్రచురణార్థం పంపవచ్చును. ఈ అక్షర యజ్ఞం పూర్తిగా వ్యాపారరహితమైనది, అందువలన తమ రచనలకు గాను సాహితి నుండి తమకు ఎటువంటి పారితోషకము అందించలేమని మనవి. తమ రచనలను గౌతమి (యూనికోడ్)ఫాంట్ ను ఉపయోగించి కంప్యూటరునందు టైపుచేసి
saahitee@gmail.com
కు ఈ-మెయిల్ ద్వారా పంపగలరు. మరేయితర ఫాంటునుపయోగించి టైపుచేసిన రచనలైనా పంపదలచినా ఫాంటునుకూడా మెయిల్ ద్వారా పంపగలరు. కంప్యూటర్ నందు తెలుగులో టైపుచేయటంలో ఏదైనా ఇబ్బంది కలిగితే తమ సందేహాలను తీర్చేందుకు, తమకు అవసరమైన సహాయాన్నందించేందుకు సాహితి ఎల్లవేలలా సంసిద్ధంగా ఉంటుంది. ఈ వెబ్ పత్రిక లో పొందుపరచిన ఉపకరణాన్ని ఉపయోగించికూడా మీరు సులభంగా తెలుగులో టైపు చేయవచ్చును. మరేవైనా సందేహాలకు సంపాదకులను దూరవాణి ద్వారా కూడా సంప్రదించవచ్చును.
సదా తమ ఆత్నీయతను కాంక్షించే
సాహితి అక్షరార్చకులు
శ్రీవైష్ణవి విజయ్ రాధిక బాబు మరియు బంధుమిత్రగణం

Thursday, July 17, 2008

Saahitee Welcomes You

saahitee welcomes you సాహితి మీకు స్వాగతం పలుకుతోంది साहिति आपका स्वागत करती है