Showing posts with label బాలసాహితి BALASAHITI. Show all posts
Showing posts with label బాలసాహితి BALASAHITI. Show all posts

Sunday, January 23, 2011

బాల సాహితి - కవిత


దేవుడు


- మాస్టర్ విజయేంద్ర బాబు

దేవుడు !
మహావీరుడు
కొండల్లో కోనల్లో
కొలువై ఉంటాడు
గాలిలో తేలుతుంటాడు
ఆశలను తీరుస్తాడు
భక్తులను ఆదరిస్తాడు
మాయలను చేస్తాడు
మనలోనూ ఉంటాడు
మంచివారి మనసుల్లో
కొలువై ఉంటాడు
అతడు ఒకడు
మరెవరో కాదు దేవుడు !

Saturday, May 29, 2010

బాలసాహితి

సాహసబాలుడు

- మాస్టర్ సి. విజయేంద్ర బాబు


అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే ఒకసారి పక్క ఊరినుండి ఒక స్కూలు పిల్లలు ఆ ఊరికి విహారయాత్రకు వచ్చారు. వాళ్ళు అల్లరి పిల్లలు. వారిలో ఒకడు వాళ్ళ గుంపు నుండి విడిపోయి పక్కకి వచ్చి ఆ ఊరిలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి ఆడుకుంటుండగా అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాముని చూడగానే ముందర చెరువు ఉందన్న సంగతి మరచి పరిగెత్తుతూ వెళ్ళి చెరువులో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో పశువులు మేపుతున్న ఒక బాలుడు అది చూసి, వాడు మునిగిపోక ముందే బయటకి లాగి కాపాడాడు. తరువాత జరిగిన విషయాన్ని వాళ్ళ టీచర్లతో చెప్పి, వాన్ని వాళ్ళకప్పగించాడు. ఆ పశువుల కాపరి బాలుని సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడటం మంచి అలవాటు.

జరిగిన పొరపాటుకు టీచర్లు బాధపడి, తమ తప్పును కూడా తెలుసుకున్నారు. పిల్లలందరికీ క్రమశిక్షణ నేర్పి వాళ్ళను చక్కగా నడుచుకునేట్టు చేశారు.

Saturday, April 3, 2010

బాల సాహితి

తెలివైన శిల్పి

- మాస్టర్ సి. విజయేంద్ర బాబు, 5వ తరగతి

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు వాడు. తనలాంటి శిల్పాలను ఎన్నో చెక్కాడు. చాలా సంవత్సరాల తరువాత అతడికి ఒక ఆలోచన వచ్చింది. తనలాంటి మాట్లాడేశిల్పాన్ని తయారు చేసాడు . కొన్ని సంవత్సరాల తరువాత, మృత్యువు తనను వెంటాడసాగింది. శిల్పి తనను తాను కాపాడుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను చెక్కిన శిల్పాల మధ్య నిలుచుకున్నాడు. అప్పుడు అతనిని పట్టుకోడానికి మృత్యుదేవత ఒక ఉపాయము ఆలోచించి, “ఆహా! ఎవరీ శిల్పి” అంది. శిల్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు తను చెక్కిన ఆ మాట్లాడే శిల్పం నేనే ఆశిల్పిని అంది. అప్పుడు మృత్యువు ఆ శిల్పాన్ని తన వెంట తీసుకొని వెళ్ళింది. శిల్పి ఎన్నో రోజులు ఆనందంగా జీవించాడు.

Friday, May 15, 2009

బాలసాహితి BALASAHITI


చిన్న కథ


కొంగ ఆలోచన



సి. శ్రీవైష్ణవి, ఒకటవ తరగతి.


ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ఒక సారి ఒక మృగాన్ని చూసింది. చూసి బయపడింది. ఆ మృగం కొంగని తినేద్దామా అనుకుంది. ఆ కొంగ పరిగెత్తి పోదామనుకుంది. ఆ కొంగకి దాహం వేసింది. నీళ్ళు తాగి పోదామనుకుంది. ఇంతలోనే ఆ మృగం ఆ కొంగని తినేసింది.


నీతి – ఆలోచించిన ప్రకారం చేయాల్సిన పని వెంటనే చేయాలి. ఆ కొంగ అనుకున్న వెంటనే ఎగిరిపోయి ఉండాల్సింది.

Monday, May 11, 2009

బాలసాహితి BALASAHITI







చిన్న కథ




కనువిప్పు




- మాస్టర్ సి. విజయేంద్ర బాబు





ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా సోమరిగా ఉండేవాడు. అతడికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయి. అతడి పేరు రంగన్న. అతడు రోజూ పని చేసేవాడు కాడు. అతడు రోజూ ప్రోద్దున నుంచి రాత్రి దాకా నీరు మాత్రం వదిలేవాడు. ఒక సారి అలాగే నీరు వదిలేందుకు రంగన్న, అతని కొడుకు పొలానికి వెళ్ళినపుడు ఉన్నట్టుండి పెద్దగా వాన కురిసింది. అక్కడ గుంతలలో నీరు నిండిపోవడంతో రంగన్న అతని కొడుకు మునిగిపోయారు.


అదే సమయానికి దగ్గరలో ఉన్న వారి స్నేహితులు ఇది గమనించి వారిద్దరినీ బయటికి తీసి ఆసుపత్రి లో చేర్చారు. కోలుకున్న తరువాత రంగన్నకు కనువిప్పు కలిగింది. తమకు రోజూ పనిచేసే అలవాటు లేక, సోమరిగా ఉండటము వలన ప్రమాదము ఎదుర్కోవలసి వచ్చిందని తెలుసుకున్న రంగన్న, అతడి కొడుకు కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు.

నీతి:- ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు. అలా ఉంటే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

Tuesday, May 5, 2009