Saturday, October 24, 2009

కవిత



వరదలు


- రాజశేఖర్, చెన్నై



1) ఆంధ్రావనిలో – వరదలొచ్చె
పంటలు కోల్పోయి – పశువులు కోల్పోయి
నివాసాలు కోల్పోయి – కుటుంబాలే చేల్లాచెదురాయె
గుండె చెదిరె గూడు చెదిరె
2) గలగల పారే కృష్ణా, జీవనదులు ప్రవహించె
కన్నీటజలమాయె రాయలసీమ,
నాటి రత్నాలసీమ, నేటి కన్నీళ్ళ సీమగా పరిణమించె
3) పచ్చని పైరులతో, పచ్చగ ఉండి
సశ్య శ్యామల తెలుగు నేలను నమ్ముకున్న రైతన్న నష్టపోయె!
4) కూడు-గూడు లేక ఆకలికేకలు
ఆర్తనాదాలు మిన్నంటుతుంటే
పాలకులే త్యాగాలు చెయ్యాలి
అందరికీ చేయూత నివ్వాలి
5) క్షణం కాదు యుగాలైన
సాఫీగా బ్రతకగలమంటు
ధీమా వ్యక్తం చేస్తున్నవారెందరికో
జీవితమంటే ఏమిటో తెలిసిపోయె
భోగభాగ్యాలు సమసిపోయె,
*****

No comments: