Monday, August 4, 2008

మన తెలుగు manatelugu


మన తెలుగు పద్యాలు

మన తెలుగు వాజ్ఞ్మయం సదా స్మరించదగిన, గర్వించదగిన పద్యసంపదకు భాండాగారం. బహుశా దక్షిణాది భాషలలో ఈ విషయంలో తెలుగు తరువాతే మరే ఇతర భాషల పద్యాలైన అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి పద్యసంపదకు వారసులమైనందుకు కనీసం కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు పద్యాలను గురించి తెలుసుకొనడం తెలుగువారిగా మన కనీసధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడంలో మీకు తోడ్పడేందుకు చెన్నపురి తెలుగుకవి శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ సమ్మతించారు. సాహితి ద్వారా మన తెలుగు శీర్షికలో ప్రతి నెల ఆణిముత్యం లాంటి ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సత్ప్రయత్నానికి మన్నవగారు అభినందనీయులు. ఈ క్రమంలో మొదటి ఆణిముత్యం ...

గజేంద్రమోక్షం

ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందుఁబరమేశ్వరుఁడెవ్వడు మూలకారణం
బెవ్వఁడనాదిమధ్యలయుఁడెవ్వఁడు సర్వము దాన యైనవాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


ఎవనివలన జగము పుట్టి, పెరిగి, నశించుచున్నదో, ఎవ్వడు అన్ని జీవులకూ ప్రభువో, ఎవ్వడు అన్నిటికీ మూలకారణమో, ఎవరికి ఆది, అంతములు లేవో, ఎవడు సర్వాత్మస్వరూపుడో... అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.

గజేంద్రమోక్షం (పోతనామాత్య విరచితం) నుండి.

No comments: