Saturday, August 23, 2008
Friday, August 15, 2008
వెబ్ లోకం
వెబ్ లోకం
వెబ్ విశ్వంలో తెలుగు ఏ స్థానంలో ఉందో ఆలోచించి తెలుగు వ్యాప్తికై నేను సైతం కృషిచేయగలనని సంకల్పించే తెలుగువీరుల చైతన్యం కోసమే ‘వెబ్ లోకం’ శీర్షిక. సాహితి పాఠకులలో వెబ్ పరిజ్ఞానాన్ని వికసింపజేయటానికి ఉద్దేశించిన ఈ శీర్షిక లో ధారావాహికంగా ప్రచురితమయ్యే వ్యాసాల పరంపరలో మొదటి వ్యాసం ‘వెబ్ లో తెలుగు’ చదవగలరు.
వెబ్ లో తెలుగు
- డా. సి. జయ శంకర బాబు
వెబ్ విశ్వంలో తెలుగు స్థానం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, ఆపై తెలుగు అభిమానుల తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దాం.
కంప్యూటర్లు పుట్టిన నాటినుండి వాటి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాషగా ఆంగ్లం వర్ధిల్లుతోంది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయమే. ఆంగ్లేయులపాలనలో మనకబ్బిన ఆంగ్లభాషా పరిజ్ఞానం మనల్ని కంప్యూటర్ రంగంలోనూ రాణిస్తున్నదేశాల్లో ఒక ప్రముఖ దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు తోడ్పడింది. ఈ పరిజ్ఞానాన్ని మన భాషలకు కూడా అందజేసి మన సంస్కృతి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, వెబ్ విశ్వంలోనూ మన భాషల ఆనవాల్లు శాశ్వతంగా ఉండేలా ప్రయత్నించటం మన కర్తవ్యం. అత్యంత అభివృద్ధి చెందిన జపాన్, చైనాలాంటి దేశాలకంటే ముందు మనదేశంలో కంప్యూటర్ వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టగలిగాము. మనకంటే ఆలస్యంగా తమ దేశంలో కంప్యూటర్లకు స్థానం కల్పించిన చైనా ఆదర్శాన్ని గురించి కూడా మనం ఈ క్షణంలో స్మరించటం ముదావహం. చైనీయులు తమ భాషకు స్థానంలేని కంప్యూటర్లకు తమదేశంలో స్థానంలేదంటూ ప్రతినబూని మరీ సాధించారు. మనం ఆంగ్లంలోనే సరిపుచ్చుకున్నా నేడు వెబ్ విశ్వంలో మన భాషల స్థితిగతులేమిటో ఆలోచిస్తే మనకు ఆవేదన కలుగక మానదు.
భారతీయ భాషలకు వెబ్ విశ్వంలో స్థానం దక్కిందని మనం సంతోషంచినా, మనమంతా సమైక్యంగా ముందుకు కదలటంలేదనే సత్యాన్ని గుర్తించవలసి ఉంది. అదెలా అంటే నిన్నటివరకూ మనభాషలకుపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన మనం వెబ్ విశ్వంలో విస్తరిస్తున్నామని సంతోషించినా, మనమందరం ఉపయోగిస్తున్నది మాత్రం ఉమ్మడి పరిజ్ఞానం కాదన్నది నిజం. ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఇతర మాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఏ కొందరో ఉపయోగిస్తున్నారు. వారు ఉపయోగిస్తున్న ఇతర కోడ్ కలిగిన ఫాంట్ లో ఉన్న కొంత సామగ్రిని సర్చ్ ఇంజన్లు వెదుకుతున్నప్పటికీ వీటి వల్ల మన తెలుగు లభించివలసిన ఉమ్మడి ప్రయోజనం మాత్రం అందటం లేదు. పరివర్తనీయత, పఠనీయత వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో వెబ్ సైట్ కు ఒక ఫాంట్ ను ఉపయోగిస్తుంటే అన్ని ఫాంట్లను మన కంప్యూటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవటం కూడా అంత వ్యావహారికం కూడా కాదు. ఫాంటు లేకుండా ఈ-మెయిల్, చాటింగ్ వగైరా కూడా సాధ్యపడదు. ఇలాంటి మరెన్నో కారణాలు, అసౌకర్యాలున్నప్పటికీ యూనికోడ్ వైపెందుకో మన వారి శీతకన్ను. మన తెలుగు పత్రికల వారిని కూడా ఈ దిశలో ముందడగు వేయమని మనమంతా కోరవలసిన బాధ్యాతా ఉంది.
మన తెలుకు సాహితీ సంపద వెబ్ విశ్వంలో వెలుగొందాలంటే మనమందరం తప్పకుండా యూనికోడ్ ను ఉపయోగించాలి. వెబ్ విశ్వంలో మన తెలుగు ఏ మాత్రం వెనుక పడకూడదన్న చైతన్యం కలిగిన అసంఖ్య తెలుగు వీరులు తమ బ్లాగులద్వారా, ఎందరో వీకీపీడియన్లు జ్ఞానయజ్ఞంలోనూ స్వచ్ఛందంగా దివారాత్రాలు శ్రమిస్తుండం వలన నేడు కూడా మనం సగర్వంగా వెబ్ భాషలందునూ తెలుగు లెస్స యని చాటగలుగుతున్నాము. ఈ విషయం మరెందరిలోనో చైతన్యం నింపేదిశగా కూడా మనం ఇప్పుడే కదలాలి. సాహితి అండతో ‘వెబ్ లోకం’ కూడా అదే ప్రయత్నంలో ఉంది.
‘వెబ్ లోకం’ శీర్షికన ప్రచురితమయ్యే తదుపరి వ్యాసం – ‘తెలుగుకు యూనికోడ్ ను ఎలా ఉపయోగించాలి?’ తప్పక చదవగలరు.
(వెబ్ లోకం web lokam by Dr. C. Jaya Sankar Babu)
Thursday, August 14, 2008
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....
- మన్నవ గంగాధరప్రసాద్, చెన్నపురి.
నేను
విహంగాన్ని
అపరిమిత స్వేచ్ఛాతత్వాన్ని
సున్నిత హృదయసంబరాన్ని.
నేను
ఒక సామాన్య మానవుణ్ని
సతతకివితాగాన లోలున్ని
బాధాసర్గశత కావ్యాన్ని
ప్రతిరోజూ మరణించే ఉదయాణ్ని
కాగితంపై జీవించే కలాన్ని
కాలాన్ని జయించే బలాన్ని
మది పుష్పాలను పండించే పొలాన్ని
దుర్మార్గహనన యజ్ఞవాటిక సిద్దం చేసే హలాన్ని.
కల్మశోన్మాధ వ్యతిరేక సైన్యాల యుద్దగీతాన్ని
కలసి కలలుగనే మనసుల భవితకు మార్గాన్ని.
సంకుచిత మనోదుర్గుణాలను పెకలించే గునపాన్ని
సమాజవనిలోని క్రూర వృక్షాల దహించే.. దావానలాన్ని.
Monday, August 4, 2008
మన తెలుగు manatelugu
మన తెలుగు పద్యాలు
మన తెలుగు వాజ్ఞ్మయం సదా స్మరించదగిన, గర్వించదగిన పద్యసంపదకు భాండాగారం. బహుశా దక్షిణాది భాషలలో ఈ విషయంలో తెలుగు తరువాతే మరే ఇతర భాషల పద్యాలైన అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి పద్యసంపదకు వారసులమైనందుకు కనీసం కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు పద్యాలను గురించి తెలుసుకొనడం తెలుగువారిగా మన కనీసధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడంలో మీకు తోడ్పడేందుకు చెన్నపురి తెలుగుకవి శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ సమ్మతించారు. సాహితి ద్వారా మన తెలుగు శీర్షికలో ప్రతి నెల ఆణిముత్యం లాంటి ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సత్ప్రయత్నానికి మన్నవగారు అభినందనీయులు. ఈ క్రమంలో మొదటి ఆణిముత్యం ...
గజేంద్రమోక్షం
ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై
ఎవనివలన జగము పుట్టి, పెరిగి, నశించుచున్నదో, ఎవ్వడు అన్ని జీవులకూ ప్రభువో, ఎవ్వడు అన్నిటికీ మూలకారణమో, ఎవరికి ఆది, అంతములు లేవో, ఎవడు సర్వాత్మస్వరూపుడో... అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.
గజేంద్రమోక్షం (పోతనామాత్య విరచితం) నుండి.
బాలసాహితిBALASAHITI

కోతి తెలివి
సి. విజయేంద్ర బాబు
Friday, August 1, 2008
అంతరంగం

బాల సాహితి

అంజలి
దీని మరువరాదు తెలుగువారు
ఎక్కడున్నగాని ఎల్లప్పుడతనిని
తలచుకొనుట మనకు ధర్మమగును.
తేజుగాడూ అన్నపూర్ణా
ఒంటెమీదా ఓడలోనూ
తేజుగాడూ అన్నపూర్ణా
అప్పడాలూ, ఆవకాయా
ఎర్రగడ్డా, గనుసుగడ్డా
కందగడ్డా, ఉర్లగడ్డా
నాకుమాత్రం పట్టదోయ్.
పత్రికా సమీక్ష
నడుస్తున్న చరిత్ర
విభిన్న ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సమైక్యతనూ, తెలుగుభాష ఔన్నత్యాన్నీకాంక్షిస్తూ నడుస్తున్న చరిత్రలో సంపాదకులు సోమల రమేష్ బాబు గారు రాస్తున్న సంపాదకీయాలు భాషాచైతన్యాన్ని పెంపొందించుకోవాలన్న తపన గల ప్రతి తెలుగు వాడి నాడికి సరికొత్త స్పందననందిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. ఉద్యమచైతన్యంతో ముందుకు సాగుతూ తెలుగుజాతి వేదికగా రూపందుకున్న ఈ పత్రికలో తెలుగు భాషా, సంస్కృతులపై వ్యాసాలు, పరిశోధనా ఫలితాలే కాకుండా తెలుగువారికి సంబంధించిన వర్తమాన సంఘటనలు, సాహితీరంగవార్తలు, కథ, కవితలు పత్రిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటీవలే వెలువడిన జూలై 2008 సంచికలో సంపాదకహృదయం ‘తెలుగుజాతి కోసం పోరాడే రాజకీయం కావాలి’ అన్నశీర్షికతో రాసిన సంపాదకీయంలో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశ సంఖ్య 76/10-6-2008 పట్ల ఆవేదన, వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమౌతోంది. ‘తెలుగు భాషా పదసంపదను కాపాడుకోవడానికి ఏంచేద్దాం?!’ అంటూ చూపు శీర్షికలో జయధీర్ తిరుమలరావుగారి పరిశోధనాత్మక వ్యాసం, తెలుగు సిరి శీర్షికన ‘తెలుగు క్లాసికల్ భాష కాదా?’ అంటూ ప్రశ్నిస్తూ ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు తమ వ్యాసంలో గిడుగు సీతాపతిగారు కేంద్రసాహిత్య అకాడమీకి వ్రాసిన సాహిత్యచరిత్రలో ఉన్న అబద్దాలే తమిళులకు పనికివచ్చాయని ఉద్ఘాటించారు. వాస్తవానికి మనం ఇటువంటి అబద్దాల పుట్టలు పెరుగుతున్న సందర్భాలలో వెంటనే స్పందించకపోవటంవల్లనే ఇటువంటి గ్రంథాలు ప్రామాణిక గ్రంథలైపోతున్నాయేమోననిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన విషయంలో ఏ గ్రంథమైనా ప్రామాణికతను పొందుతోందంటే అందులో ఉన్న నిజాలైనా, అబద్దాలైనా మనం మౌనంగా అంగీకరించబట్టే. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. సుందరం మేష్టారుగారిలాంటి వారు తమకలాల్ని ఝళిపిస్తే తెలుగుకు ఎంతోకొంత మేలు చేకూరుతుంది, సత్యమేవ జయతేకూ సార్థకత సిద్ధిస్తుంది. వ్యాఖ్యానం, తెలుగుతనం, స్వాభిమానం, పరిశోధన, న్యాయపీఠం, జ్ఞాపకాలదొంతర, అన్వేషణ మొదలైన ఆకర్షణీయమైన శీర్షికలలో రచయితలు ఆసక్తికరమైన విషయాలపై తమ భావాలను వ్యక్త పరిచారు. పరామర్శ ప్రణామం శీర్షికన పుస్తక సమీక్ష, గ్రంథాలయం శీర్షికన గ్రంథస్వీకారం సచిత్రంగా ప్రచురించారు. స్పందన శీర్షికలో గత సంచికలలోని రచనలపై పాఠక స్పందనకు స్థానందక్కింది. తెలుగువాణి సారథ్యంలో తెలుగుసంఘాల సమైక్యతలో 5, 6 జూలై 2008 న తిరుచ్చిలో ఘనంగా జరిగిన దక్షిణ భారత తెలుగు పల్లెకళల పండుగకు సంబంధించిన సచిత్రవార్తలతోపాటు పూజకుణిత కళారూపం ముఖచిత్రంగా వెలువడిన ఈసంచిక అవశ్యం పఠనీయం. నడుస్తున్న చరిత్ర ప్రతి సంచికలోనూ తెలుగు నవచైతన్యదీప్తి గోచరిస్తోంది. నేటి సాంకేతిక యుగంలో తెలుగుభాష ఔన్నత్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వెబ్ విశ్వంలో విస్తరిస్తున్న తెలుగు ఆనవాళ్ళగురించికూడా ఈపత్రికలో స్థానం కల్పిస్తే పత్రిక భాషాఉద్యమస్ఫూర్తికి సంపూర్ణత చేకూరుతుంది. రాబోయే సంచికలలో ఈ దిశగా ప్రయత్నించగలరని సాహితి ఆశిస్తోంది.
కవిత
- ఏ. రాధిక
ఊయల ఊగదాయె
జోలపాట మూగబోయె
పైరుగాలి నాట్యమాగె
సెలయేరు హోరు మరచె
కన్నతల్లులెందరో గుండెలవిసేలా
రోదనలు మిన్నంటేలా
ఎటుచూసినా ఆ ఏడుపే మారుమ్రోగె
గుండెల్లో భయం, కాలు బయట పెట్టాలంటే భయం
మెన్న దేశ సేవలో వందల జవాన్లు
నిన్న అన్నం పున్నెమెరుగని అమాయకపు ప్రజలు
నేడేమో.... రేపోమో.... ఎన్నాళ్ళీ భయం
కన్న తల్లులకీ గర్భశోకం
మనిషిని చూస్తే మనిషికి భయం
ఏ జాతి జీవికి లేని వింతరోగం
బాంబులు, మానవబాంబులతో విధ్వంసం సృష్టంచే విశ్వరోగం
అతివాదానిదదే అసలు స్వరూపం
ఏ ప్రభుత్వాలు మార్చలేవు, ఏమార్చనూలేవు
మతాలు కులాలన్నవి మట్టికరిచే దాకా
మనసున ఆ అంతర్యామి రూపం ఒక్కటిగా కనపడుదాకా
ఈ రోగం మానదు, ఈ శోకం ఆగదు
పెరుగుతున్న విజ్ఞానం మనిషిని మనిషికి
దగ్గర చేయాలని మన అందరి ఆశ
అది పెడదోవ పట్టి మనిషికి మనిషికి మద్య
అగాధం సృష్టిస్తుంటే ఆదిమ మానవుడైపోతేనే నయం
అపుడీ రోగాలేవి ఉండవన్న ఆశాభావం.
(ATIVAaDAM VISHVAROGAM – A Telugu Poem by A. Radhika for SAAHITEE)